Mahindra New Models: మార్కెట్ లోకి మహీంద్రా స్కార్పియో క్లాసిక్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కంపెనీ ఇప్పటికే మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లతో
- By Nakshatra Published Date - 04:39 PM, Sun - 21 August 22
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కంపెనీ ఇప్పటికే మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లతో పలు రకాల కార్లను చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను దృష్టిలో ఉంచుకున్న మహీంద్రా సంస్థ వారు ఎప్పటికప్పుడు అత్యాధునిక ఫీచర్లతో కొత్త కొత్త కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. కాగా తాజాగా మహీంద్రా కొత్తగా స్కార్పియో క్లాసిక్ మోడల్ ను విడుదల చేసింది. ఇందులోనే క్లాసిక్ – ఎస్, క్లాసిక్ – 11 పేర్లతో రెండు వేరియంట్లను తీసుకు వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా వీటి ధరల వివరాలను వెల్లడించింది.
క్లాసిక్ – ఎస్ ధర రూ.11.99 లక్షలుగా కాగా, క్లాసిక్ ఎస్ – 11 ధరను రూ.15.49 లక్షలు అని పేర్కొంది. తాజాగా విడుదల చేసిన ఈ మోడల్ రెడ్, బ్లాక్, సిల్వర్, వైట్ కలర్స్లో మనకు లభించనున్నాయి. ఈ మోడల్ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే.. గత మోడళ్లతో పోలిస్తే క్లాసిక్ మోడల్ బరువు 55కిలోలు తక్కువగా ఉంటుందని మహీంద్రా కంపెనీ తెలిపింది. 2.2 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ తో వస్తున్న ఈ ఎస్యూవీ 132 పీఎస్ పవర్ను, 300Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులోనే 6 మాన్యువల్ గేర్ బాక్స్ అందిస్తున్నారు. అయితే గత మోడళ్లతో పోల్చుకుంటే 14శాతం అధిక మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది.
అలాగే మెరుగైన సస్పెన్షన్, ఆర్17 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, నూతన డీఆర్ఎల్ వంటి ప్రత్యేకతలు దీంట్లో ఉన్నట్లుగా కంపెనీ వెల్లడించింది. ఇక 9 అంగుళాల టచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఓఎస్తో పనిచేస్తుందట. అలాగే ఇందులో స్క్రీన్ మిర్రరింగ్ సదుపాయంతో పాటు 7 సీటర్, 9 సీటర్ ఆప్షన్స్ లతో ఈ మోడల్ వస్తోంది.
Related News
Discount offer on Cars: ఫిబ్రవరిలో ఈ కార్లపై భారీగా డిస్కౌంట్.. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే?
ఈ ఏడాది మొదలైన తర్వాత చాలా వరకు కార్ల తయారీ సంస్థలు వాటి కార్లపై ధరలను విపరీతంగా పెంచేసిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది డిసెంబర్లో కార్ల