Pan Aadhar Link: ఆధార్ తో పాన్ లింక్ ఇంకా చేయలేదా.. ఆ గడువులోపు చేయకపోతే అంతే సంగతులు!
ఆధార్ తో పాన్ కార్డు లింక్ చేయని వారికి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
- By Anshu Published Date - 10:30 AM, Sat - 30 November 24

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డుల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఇవి రెండూ ప్రతి ఒక్క పనికి చాలా ముఖ్యమైన డాక్యుమెంట్లుగా మారిపోయాయి. ఇవి రెండూ ఒకదానితో ఒకటి లింక్ చేయడం అన్నది తప్పనిసరి. అయితే ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయమంటూ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ గడువును జూన్ 30తో ముగిసినప్పటికీ జరిమానాతో అనుసంధానం చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానం చేసుకునే గడువు ముగియడంతో ప్రభుత్వం డిఫాల్టర్లపై జరిమానా విధించడం ప్రారంభించింది.
అనుసంధానం కానీ పాన్ నంబర్లు జూలై ఒకటి నుంచి పనిచేయడం మానేశాయి. అయితే దేశంలో ఆదాయపు పన్ను చెల్లించేవారందరూ తప్పనిసరంగా తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలి. లేదంటే వారందరూ ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయలేదు. అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా జరగడం కోసం పన్ను చెల్లింపులు సక్రమంగా ఉండడం కోసం ఆధార్ కార్డు పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరి అని చెబుతున్నారు. అయితే మొదటి వరకు ఆధార్ తో పాన్ కార్డు లింక్ ను ఫ్రీగా చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఆదాయపు పన్ను శాఖ. కానీ ఇచ్చిన గడువు ముగియడంతో ఇప్పుడు జరిమానా తో అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఇందుకోసం 2022 మార్చి 31 చివర తేదీ అని ఆదాయపు పన్ను శాఖ గతంలో ప్రకటించింది. అనంతరం 2023 జూన్ వరకూ గడువును పెంచింది. అప్పటికీ లింక్ చేసుకోని వారికి జరిమానా విధిస్తోంది. 2023 జూలై 1 నుంచి ఈ ప్రక్రియ చేసుకునే వారి నుంచి రూ.వెయ్యి జరిమానా కట్టించుకుంటున్నారు. జరిమానా కట్టాలని పాన్ లింక్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జరిమానా కట్టి పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవడం చాలా అవసరం. ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా చాలా సులువుగా ఈ పని చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం దగ్గరలో ఆధార్ లేదా పాన్ సెంటర్లను సంప్రదించడం మంచిది.