BSNL 5g: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త.. త్వరలోనే అందుబాటులోకి 5 జీ సేవలు?
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఒక చక్కటి శుభవార్త. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్న
- By Nakshatra Published Date - 07:00 AM, Sat - 10 December 22
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఒక చక్కటి శుభవార్త. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ ఎదురుచూపులుకు త్వరలోనే చెక్ పెట్టనుంది బిఎస్ఎన్ఎల్ సంస్థ. ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన నగరాలలో బీఎస్ఎన్ఎల్ 5 జీ సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్ఎల్ టవర్లను అప్డేట్ చేయనున్నారు.
కాగా ఇప్పటికీ వినియోగదారులు 4 జీ సేవలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ సేవలను రానున్న 5 నుంచి 7 నెలల్లో 5జీకి అప్డేట్ చేయనుంది బీఎస్ఎన్ఎల్ సంస్థ. ఇదే విషయాన్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్కు చెందిన 1.35 లక్షల టెలికాం టవర్లను అప్డేట్ చేయనున్నట్లు ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. దేశీయంగా టెలికాం టెక్నాలజీ అభివృద్ధి నిధిని ఏడాదికి రూ. 500 కోట్ల నుంచి రూ. 4000 కోట్లకు పెంచడానికి కేంద్రం సన్నాహాలు చేస్తుందని తెలిపారు.
టెలికాం రంగంలో స్థిరత్వం తీసుకురావడంలో బీఎస్ఎన్ఎల్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి వెల్లడించారు. దేశంలో బీఎస్ఎన్ఎల్కు 1.35 లక్షల మొబైల్ టవర్లు ఉన్నాయని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో బలమైన ప్రాతినిధ్యం ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే 5జీ పరీక్షల్లో భాగంగా అవసరమైన వస్తువులను అందించాల్సిందిగా టీసీఎస్ కంపెనీని బీఎస్ఎన్ఎల్ కోరింది. 5జీ ప్రయోగాత్మక సేవలను కంపెనీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ కంపెనీల ఏర్పాటు మద్ధతు ఇస్తోందని చెప్పిన కేంద్ర మంత్రి ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేయనున్నట్లు తెలిపారు. రైల్వేలో ఇప్పటికే 800 స్టార్టప్లు, రక్షణ రంగంలో 200 స్టార్టప్లు ఏర్పాటయ్యాయని మంత్రి చెప్పుకొచ్చారు. విటితో పాటుగా అన్ని రంగాల్లో ఇదే విధంగా కొత్త ఆలోచనలు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.
Related News
Amrit Bharat Trains : రాబోయే రోజుల్లో 1000 అమృత్ భారత్ రైళ్లు
రాబోయే సంవత్సరాల్లో భారతదేశం కనీసం 1,000 కొత్త తరం అమృత్ భారత్ రైళ్లను తయారు చేస్తుందని , అదే సమయంలో గంటకు 250 కి.మీ వేగంతో నడిచే రైళ్లను తయారు చేయడానికి కూడా పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం తెలిపారు. PTI-వీడియోలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, వందే భారత్ రైళ్ల ఎగుమతిపై రైల్వే ఇప్పటికే పని ప్రారంభించిందని, వచ్చే ఐదేళ్లలో మొదటి ఎగుమతి జరుగుతుందని ఆయన