BP Monitor: బీపీ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తున్నారా.. ఇకపై స్మార్ట్ ఫోన్ ద్వారా బీపీ చెక్ చేసుకోండిలా?
సాధారణంగా రక్తపోటు సమస్య ఉన్నవారు తరచుగా బీపీ చెక్ చేయించుకుంటూ ఉంటారు. అందుకోసం సమీప ఆస్పత్రికి వెళ్లడం లేదంటే ఏదైనా క్లినిక్ కి వెళ్లి చెక
- By Nakshatra Published Date - 07:15 PM, Mon - 5 June 23
సాధారణంగా రక్తపోటు సమస్య ఉన్నవారు తరచుగా బీపీ చెక్ చేయించుకుంటూ ఉంటారు. అందుకోసం సమీప ఆస్పత్రికి వెళ్లడం లేదంటే ఏదైనా క్లినిక్ కి వెళ్లి చెక్ చేయించుకుంటూ ఉంటారు. ఇక గ్రామీణ ప్రాంతాలలో అయితే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి వెళ్లి బీపీ చెక్ చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రం కేవలం బీపీ డౌన్ అయినప్పుడు మాత్రమే వెళ్లి చూపించుకుంటూ ఉంటారు. ఇది ఈ బీపీ వల్ల మానసిక ప్రశాంతత కూడా దెబ్బతింటుంది అన్న విషయం చాలామందికి తెలియదు.
ఆ సంగతి పక్కన పెడితే ఇదివరకటిలాగా మనం బీపీ చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్లాల్సిన పని లేదు. ఇంటి దగ్గరే ఉండి స్మార్ట్ ఫోన్ ద్వారా బీపీ చెక్ చేసుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్మార్ట్ ఫోన్ సహాయంతో రక్తపోటుని చెక్ చేసుకోవడానికి మోనిటర్ చేసే క్లిప్ ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా షాన్ డియాగో బృందం తయారు చేసింది. ఫోన్లో ఉన్న ఒక యాప్ సహాయంతో బిపిని చెక్ చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కోసం 80 సెంట్స్ ఖర్చు అయిందట. అయితే దీనిని కేవలం 10 గంటలకు తీసుకువచ్చే విధంగా పరిశోధకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
టెక్నాలజీకి సంబంధించిన వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ లోని జర్నల్ లో పబ్లిష్ అయ్యింది. దీని సహాయంతో రెగ్యులర్ బిపి మోనిటరింగ్ సులభతరం అవుతుంది. అలాగే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అంతేకాకుండా హాస్పిటల్ కి వెళ్లి గంటలసేపు అక్కడ నిలబడాల్సిన అవసరం ఉండదు. వృద్ధులకు గర్భిణీ మహిళలకు తరచూ బీపీ చెక్ చేసుకోవడానికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీని ద్వారా పదేపదే హాస్పిటల్ కి వెళ్లి బీపీ చెక్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే బిపి చెక్ చేసుకోవడానికి వినియోగదారుడు క్లిప్పు పై చూపుడు వెళుతున్నట్లయితే సరిపోతుంది. స్మార్ట్ ఫోన్ యాప్ వినియోగదారుడు ఎంతసేపు నొక్కాలి అనే దానిపై మార్గ నిర్దేశం చేస్తుంది. క్లిప్పుకు 3డి ప్రింటెడ్ ప్లాస్టిక్ అటాచ్మెంట్ అయి ఉంటుంది. ఇది స్మార్ట్ ఫోన్ కెమెరా ఫ్లాష్ సైజ్ లోనే ఉంటుంది. వినియోగదారుడు క్లిప్ పై నొక్కినప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ వేలిముద్రను వెలిగిస్తుంది. క్లిప్పు లోపల ఉన్న స్ప్రింగ్ వినియోగదారుని వివిధ స్థాయిల శక్తితో నొక్కడానికి అనుమతినిస్తుంది. వినియోగదారుడు ఎంత గట్టిగా నొక్కితే అంత సైజులో కెమెరాలో అంత పెద్దగా రెడ్ సర్కిల్ కనిపిస్తుంది. ఆ సమయంలో స్మార్ట్ ఫోన్ యాప్ ఈ రెడ్ సర్కిల్ నుంచి ప్రధాన సమాచారం గ్రహించి వేలిముద్ర లోనికి వెలుపలికి వెళ్లే రక్తం పరిమాణంని కొలుస్తుంది. యాప్ లోనే ఒక అల్గోరిథం ఈ సమాచారాన్ని సిస్టోలిక్ డయాస్టోలిక్ రీడింగులుగా మారుస్తుంది. అది త్వరలోనే దీనిని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురా అన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
Related News
Smartphone Pinky : ‘స్మార్ట్ఫోన్ పింకీ’ వస్తోంది.. బీ కేర్ ఫుల్ !!
Smartphone Pinky : స్మార్ట్ఫోన్ను మనలో చాలామంది అతిగా వాడేస్తున్నారు.