Roundtable
-
#Andhra Pradesh
CM Chandrababu : ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు.. నేడు కేంద్రమంత్రులతో భేటీ..
CM Chandrababu : దావోస్లో జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో అనేక ప్రముఖ సంస్థల సీఈవోలు, అధిపతులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో బిజీగా గడిపిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూలమైన అవకాశాలు, అభివృద్ధి పరిస్థితుల గురించి వివరణ ఇచ్చారు. ఈ పర్యటన ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో మరింత ముందుకు వెళ్లే అవకాశం సృష్టించిందని చెప్పవచ్చు.
Published Date - 11:34 AM, Fri - 24 January 25