Missing Child Case
-
#Andhra Pradesh
Jnaneswari Missing: జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్
తుని మండలం సీహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో కాపలాగా పనిచేస్తున్న సుంకర గణేశ్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి, జూన్ 6న అదృశ్యమైన విషయం తెలిసిందే. తల్లి వంట చేస్తున్న సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న పాప కనిపించకుండా పోయింది. కుటుంబానికి చెందిన పెంపుడు కుక్కతో కలిసి కొండ వైపు వెళ్లినట్లు ఒక గ్రామస్థుడు చూసినా, ఆ తర్వాత కుక్క మాత్రమే ఒంటరిగా తిరిగి వచ్చింది. మంగళవారం తునిలో డీఎస్పీ తిలక్ మీడియాతో మాట్లాడుతూ, పాప ఆచూకీయే […]
Date : 08-07-2026 - 11:33 IST -
#Andhra Pradesh
jnaneswari: జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..
కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సీహెచ్ అగ్రహారం గ్రామంలో ఉండే చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. పాప జాడ కనిపెట్టేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తీవ్రంగా గాలించాయి. సాంకేతికత సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ నెల రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. పాప ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ప్రకటించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. ఈ నేపథ్యంలో చిన్నారి జ్ఞానేశ్వరి […]
Date : 07-07-2026 - 10:12 IST -
#Andhra Pradesh
Jnaneswari Missing: జ్ఞానేశ్వరి కేసులో పోలీసులు కొత్త ప్లాన్.. తుని పాప సమాచారం ఇస్తే లక్ష బహుమతి
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో మిస్టరీ 25 రోజులుగా కొనసాగుతూనే ఉంది. పాప ఆచూకీ కోసం పోలీసులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్నారి సమాచారం అందించిన వారికి రూ.లక్ష నగదు పారితోషికం ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు చిన్నారి ఫొటో, గుర్తింపు వివరాలతో కూడిన వాల్పోస్టర్లను విడుదల చేశారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఈ పోస్టర్లను అంటిస్తున్నారు. సమాచారం […]
Date : 01-07-2026 - 12:58 IST