Virat Kohli Breaks Rahul Dravid’s Record : టెస్టుల్లో రాహుల్ ద్రవిడ్ను అధిగమించిన విరాట్ కోహ్లీ
Virat Kohli Breaks Rahul Dravid's Record : యశస్వి తర్వాత గిల్ వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. ఈ పరిస్థితుల్లో కోహ్లీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ కోహ్లీ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు
- Author : Sudheer
Date : 16-12-2024 - 7:27 IST
Published By : Hashtagu Telugu Desk
బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా (India-Australia) మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లోనూ విరాట్ కోహ్లీ (Virat Kohli ) విఫలమయ్యాడు. యశస్వి తర్వాత గిల్ వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. ఈ పరిస్థితుల్లో కోహ్లీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ కోహ్లీ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. జోస్ హేజిల్వుడ్ కోహ్లీని 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేశాడు. కోహ్లి 16 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. అయితే కోహ్లీ చేసింది 3 పరుగులు అయినప్పటికీ ఆస్ట్రేలియాలో టెస్టు క్రికెట్లో పరుగుల పరంగా భారత జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)ను విరాట్ కోహ్లీ అధిగమించాడు.
ఆస్ట్రేలియాపై 62 టెస్టు ఇన్నింగ్స్ల్లో ద్రవిడ్ 2166 పరుగులు చేశాడు. అదే సమయంలో కోహ్లీ 48 టెస్ట్ ఇన్నింగ్స్లలో 2168 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన వారిలో సచిన్ టెండూల్కర్ (3630), వివిఎస్ లక్ష్మణ్ (2424) మొదటి రెండు స్థానాల్లో ఉండగా ఇప్పుడు కోహ్లీ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విరాట్ కోహ్లీ బ్యాడ్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. పెర్త్లో విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్లో 5 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో అజేయంగా 100 పరుగులు చేశాడు. దీని తర్వాత అడిలైడ్లో రెండు ఇన్నింగ్స్లలో వరుసగా 7 మరియు 11 పరుగులు చేశాడు. అదే సమయంలో గబ్బాలో విరాట్ కోహ్లి మొదటి ఇన్నింగ్స్లో 3 పరుగులు చేసి చౌకగా పెవిలియన్కు చేరుకున్నాడు.
ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఫ్యాబ్-4 ఆటగాళ్లలో కోహ్లీ దరిదాపుల్లో కూడా లేడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 17 ఇన్నింగ్స్లలో 25 సగటుతో 376 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ మాత్రమే నమోదైంది.
Read Also : MIC Electronics : ట్రైన్ డిస్ప్లే బోర్డ్ ప్రాజెక్ట్ను పూర్తి చేసిన MIC ఎలక్ట్రానిక్స్..