Ind Vs Aus: కుల్దీప్ పై మండిపడిన కోహ్లీ, రోహిత్.. అసలేం జరిగిందంటే?
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే చెన్నై వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ ఓడిపోవడంతో తొలి
- By Nakshatra Published Date - 06:46 PM, Wed - 22 March 23
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే చెన్నై వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ ఓడిపోవడంతో తొలి బ్యాటింగ్ కు ఆస్ట్రేలియా దిగింది. ఈ క్రమంలోని 38 ఓవర్లు ముగించేసరికి ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. కాగా హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్లు ఇద్దరు కలిసి మూడు వికెట్లు సాధించారు. అక్షర్ పటేల్ ఓ వికెట్ సాధించాడు.
ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్పై కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కోపంతో ఊగిపోయారు. అసలేం జరిగిందంటే..ఆసీస్ ఇన్నింగ్స్ 25 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ మూడో బంతికి డేవిడ్ వార్నర్ను పెవిలియన్కు పంపాడు. అనంతరం నాలుగో బంతిని అద్భుతమైన గూగ్లీగా కుల్దీప్ సంధించాడు. ఈ క్రమంలో నే బంతి క్రీజులోకి వచ్చిన అలెక్స్ కారీ ప్యాడ్కు తాకింది. దాంతో బౌలర్ తో పాటు రోహిత్, విరాట్ ఎల్బీకీ అప్పీలు చేశారు. అయితే ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు.
— javed ansari (@javedan00643948) March 22, 2023
ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, స్లిప్లో ఉన్న కోహ్లితో చర్చలు జరిపి రివ్యూ తీసుకోనేందుకు సిద్దమయ్యాడు. అయితే బౌలర్ కుల్దీప్ మాత్రం రోహిత్ నిర్ణయాన్ని తిరష్కరించి బౌలింగ్ వేసేందుకు తన స్ధానానికి వెళ్లిపోయాడు. దీంతో కుల్దీప్ పై రోహిత్, కోహ్లి కోపంతో ఊగిపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Related News
Centuries In IPL: ఐపీఎల్లో సెంచరీల మోత.. ఇప్పటివరకు ఆరు శతకాలు.. బట్లరే రెండు బాదాడు..!
ఈ ఏడాది ఐపీఎల్లో భారీ స్కోర్లు నమోదు చేసే ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు సార్లు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ స్కోర్లను నమోదు చేసింది.