T20 World Cup SF: కీలక ప్లేయర్స్ కు అస్వస్థత… సెమీస్ కు ముందు భారత్ కు షాక్
టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలగా ఉన్న భారత మహిళల జట్టు ఇవాళ సెమీ ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. రికార్డులు , ఫామ్ ప్రకారం ఆసీస్ దే పై చేయిగా ఉంది. దీంతో ఆ జట్టును ఓడించాలంటే భారత్ సర్వ శక్తులూ ఒడ్డాల్సిందే.
- By Naresh Kumar Published Date - 03:27 PM, Thu - 23 February 23
T20 World Cup SF: టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలగా ఉన్న భారత మహిళల జట్టు ఇవాళ సెమీ ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. రికార్డులు , ఫామ్ ప్రకారం ఆసీస్ దే పై చేయిగా ఉంది. దీంతో ఆ జట్టును ఓడించాలంటే భారత్ సర్వ శక్తులూ ఒడ్డాల్సిందే. అయితే కీలక మ్యాచ్ కు ముందు భారత్ కు షాక్ తగిలింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్లార్ ప్లేయర్ పూజా వస్త్రాకర్ సెమీస్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. కీలక మ్యాచ్కు ముందు ఈ ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. హర్మన్ప్రీత్ కౌర్ అనారోగ్యం నుంచి కోలుకోకపోతే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన జట్టును నడిపించే అవకాశాలు ఉన్నాయి. ఐర్లాండ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్కు ముందే హర్మన్ప్రీత్ కౌర్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో అలానే బరిలోకి దిగిందని సమాచారం. సెమీ ఫైనల్కి ముందు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రాక్టీస్ సెషన్లలోనూ పాల్గొనలేదు. తాజాగా తప్పని పరిస్థితుల్లో హర్మన్ప్రీత్ కౌర్ ను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
మరోవైపు పుజావస్త్రాకర్ కూడా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరితో పాటు భారత స్పిన్నర్ రాధా యాదవ్ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. రాధా యాదవ్, సెమీ ఫైనల్ సమయానికి టీమ్తో కలుస్తుందా అనేది సందిగ్ధంగా మారింది. కాగా రాధా యాదవ్కు ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. తను కూడా దూరమైతే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి.
సెమీఫైనల్లో ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టుపై గెలవడం అంత సులువు కాదు. ఇప్పటికే రెండు వరస టీ20 వరల్డ్ కప్ లతోపాటు మొత్తంగా ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచింది.ఈ నేపథ్యంలో సెమీఫైనల్లో ఆ టీమ్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
Related News
India vs Australia: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్.. వేదికలివే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా (India vs Australia)లో పర్యటించనుంది.