Foreign Players: ఊహించిన దాని కంటే తక్కువ డబ్బును దక్కించుకున్న ముగ్గురు విదేశీ ఆటగాళ్లు..!?
IPL 2024 వేలం ముగిసింది. అయితే కొంతమంది విదేశీ ఆటగాళ్లు (Foreign Players) ఊహించిన దాని కంటే చాలా తక్కువ డబ్బు అందుకున్నారు.
- By Gopichand Published Date - 01:30 PM, Wed - 20 December 23
Foreign Players: IPL 2024 వేలం ముగిసింది. ఈ వేలంలో తొలిసారిగా రూ.20 కోట్లకు పైగా ధర పలికింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ను కోల్కతా నైట్ రైడర్స్ రూ. 24.75 కోట్లు చెల్లించి తమ జట్టులో చేర్చుకుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా ప్రపంచ ఛాంపియన్ కెప్టెన్ పాట్ కమిన్స్ను 20.50 కోట్లు చెల్లించి సన్రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులో చేర్చుకుంది. ఈ ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆటగాళ్లు కూడా కోట్ల రూపాయలు అందుకున్నారు. అయితే కొంతమంది విదేశీ ఆటగాళ్లు (Foreign Players) ఊహించిన దాని కంటే చాలా తక్కువ డబ్బు అందుకున్నారు. అలాంటి ముగ్గురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!
రచిన్ రవీంద్ర – న్యూజిలాండ్
ఈ జాబితాలో మొదటి పేరు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర. భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో రచిన్ తన జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించాడు. ఇది అతనికి మొదటి ప్రపంచకప్ అయినప్పటికీ రచిన్ తన టాప్-ఆర్డర్ బ్యాటింగ్, ఎడమ చేతి బౌలింగ్తో క్రికెట్ అభిమానులను, నిపుణులందరినీ ఆకట్టుకున్నాడు. ఈ కారణంగానే రచిన్ రవీంద్ర పేరు మీద వేలంలో భారీ బిడ్ వస్తుందని భావించినా అది జరగలేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఆటగాడి పేరును రూ. 50 లక్షల ప్రాథమిక ధరతో వేలం వేయడం ప్రారంభించి చివరకు కేవలం రూ. 1.80 కోట్లకు కొనుగోలు చేసింది.
Also Read: Sameer Rizvi: సమీర్ రిజ్వీని రూ. 8 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసిన చెన్నై.. ఎవరీ రిజ్వీ..?
ట్రావిస్ హెడ్ – ఆస్ట్రేలియా
ప్రపంచకప్లో సెమీ-ఫైనల్, ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ టాప్-6లో ఏ నంబర్లోనైనా బ్యాటింగ్ చేయగలడు. అతను ఆఫ్-బ్రేక్ బౌలింగ్ కూడా చేస్తాడు. అద్భుతమైన ఫీల్డర్ కూడా. అతనికి దేశవాళీ క్రికెట్లో కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది. అందుకే ఈ ఆటగాడి పేరు కోసం భారీ బిడ్ని ఆశించారు. అయితే హైదరాబాద్ ఈ ఆటగాడిని 6.80 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇది ట్రావిస్ హెడ్ స్థాయి కంటే చాలా తక్కువ.
గెరాల్డ్ కోయెట్జీ – దక్షిణాఫ్రికా
భారత్లో జరిగిన ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా యువ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ తన జట్టు తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఈ బౌలర్ భారత పిచ్లపై తన వేగం, స్వింగ్తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇది కాకుండా అతను పెద్ద హిట్స్ కూడా కొట్టగలడు. ఈ కారణంగా కోయెట్జీ కూడా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాలని భావించారు. కానీ అది జరగలేదు. ముంబై ఇండియన్స్ కేవలం రూ. 5 కోట్లు చెల్లించి ఈ ఆటగాడిని తమ క్యాంపులో చేర్చుకుంది.
Related News
IPL 2024: ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు, సిక్సులు, వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ -2024 లీగ్ రౌండ్ ముగిసింది. ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది.