Asia Cup Women: వరుణుడి దెబ్బకు బంగ్లా సెమీస్ బెర్త్ గల్లంతు
- By Hashtag U Published Date - 04:16 PM, Tue - 11 October 22
మహిళల ఆసియా కప్ లో ఆతిథ్య బంగ్లాదేశ్కు వరుణుడు షాక్ ఇచ్చాడు. వర్షం వరణుడు కారణంగా ఆ జట్టు సెమీస్ బెర్త్ చేజారింది. చివరి సెమీస్ బెర్త్ కోసం బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వర్షం ఆటంకం కలిగించింది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉండటంతో ఈ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
దీంతో బంగ్లా, యూఏఈ జట్లకు చెరో పాయింట్ లభించింది. మొత్తంగా 5 పాయింట్లు మాత్రమే సాధించిన బంగ్లా గ్రూప్ దశలో ఐదో స్థానంలో నిలిచిపోయింది. మరోవైపు.. పాకిస్తాన్పై సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన థాయ్లాండ్ ఆరు పాయింట్లతో సెమీస్కు అర్హత సాధించింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా భారత్, పాకిస్తాన్, శ్రీలంకతో బంగ్లాదేశ్ సెమీస్ కు చేరాయి. అక్టోబరు 13న సెమీ ఫైనల్స్ , 15న ఫైనల్ జరుగనుంది.
Related News
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ తుది జట్టు ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును బీసీబీ ప్రకటించింది. బంగ్లాదేశ్ జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో కెప్టెన్గా వ్యవహరించగా, షకీబ్ అల్ హసన్ తిరిగి వచ్చాడు. స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తిరిగి జట్టులోకి రావడంతో ఆ జట్టు బలంగా తయారైంది.