ASIA CUP : భారత్ ధాటికి బ్యాట్లెత్తేసిన శ్రీలంక
మహిళల ఆసియాకప్ ఫైనల్లో హోరాహోరీ పోరు కోసం ఎదురుచూసిన క్రికెట్ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. సెమీస్ లో పాక్ ను నిలువరించిన శ్రీలంక మహిళల జట్టు తుది పోరులో మాత్రం చేతులెత్తేసింది.
- By Naresh Kumar Published Date - 02:34 PM, Sat - 15 October 22
![ASIA CUP : భారత్ ధాటికి బ్యాట్లెత్తేసిన శ్రీలంక](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/10/222.jpg)
మహిళల ఆసియాకప్ ఫైనల్లో హోరాహోరీ పోరు కోసం ఎదురుచూసిన క్రికెట్ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. సెమీస్ లో పాక్ ను నిలువరించిన శ్రీలంక మహిళల జట్టు తుది పోరులో మాత్రం చేతులెత్తేసింది. భారత బౌలర్ల ధాటికి విలవిలలాడిన లంక కేవలం 65 పరుగులకే పరిమితమైంది. టాస్ గెలవడం ఒక్కటే లంకకు దక్కిన ఆనందం. ఈ సంతోషం ఆవిరయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. మూడో ఓవర్ నుంచే లంక పతనం మొదలైంది. స్కోర్ కనీసం 10కి కూడా చేరకుండానే నలుగురు…25 పరుగులకే మరో ముగ్గురు ఔటయ్యారు. అంచనాలు పెట్టుకున్న చమారా ఆటపట్టు , డిసిల్వా, హాసిని నిరాశపరిచారు. చివర్లో రణవీర కాసేపు పోరాడకుంటే శ్రీలంక స్కోర్ 50 కూడా దాటేది కాదు. లంక ఇన్నింగ్స్ లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించగా… మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 3, రాజేశ్వరి 2 , స్నేహరాణా 2 వికెట్లు పడగొట్టారు.
Related News
![India Women: చరిత్ర సృష్టించిన భారత్.. ఒకే రోజులో ఎక్కువ పరుగులు చేసిన రెండో జట్టుగా రికార్డు..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/safeimagekit-GRKGhbVWsAAvu5u_11zon.jpeg)
India Women: చరిత్ర సృష్టించిన భారత్.. ఒకే రోజులో ఎక్కువ పరుగులు చేసిన రెండో జట్టుగా రికార్డు..!
India Women: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య నేడు టైటిల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్ను గెలుచుకోవాలనే సౌతాఫ్రికా ఎదురుచూస్తోంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా గెలుపు రథాన్ని నిలిపి రెండోసారి టీ20 క్రికెట్లో ఆధిక్యత సాధించేందుకు భారత జట్టు ప్రయత్నిస్తుంది. ఈ గొప్ప మ్యాచ్కు ముందు భారత మహిళా క్రికెట్ జట్టు (India Women) దక్షిణాఫ్రికా క్రికెట�