RCB vs CSK Playoff Scenarios: చెన్నైపై ఆర్సీబీ సంచలన విజయం.. ప్లేఆఫ్స్కు అర్హత
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై భారీ విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
- By Praveen Aluthuru Published Date - 12:22 AM, Sun - 19 May 24

RCB vs CSK Playoff Scenarios:బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై భారీ విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
కీలక మ్యాచ్ లో ఆర్సీబీ అదరగొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా (RCB vs CSK) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటర్లు రాణించడంతో ఆర్సీబీకి గౌరవప్రదమైన టార్గెట్ దక్కింది. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీకి కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో శుభారంభం లభించింది. లాంగ్ ఆన్లో డారిల్ మిచెల్ చేతిలో కోహ్లి క్యాచ్ ద్వారా సాంట్నర్ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ 47 పరుగులు చేశాడు. ఆ తర్వాతా కెప్టెన్కు మద్దతుగా రజత్ పాటిదార్ క్రీజులోకి వచ్చాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 35 పరుగులు జోడించి జట్టును 100 పరుగులు దాటించారు. డు ప్లెసిస్ చిత్రమైన రీతిలో రనౌట్ అయ్యాడు. ఫాఫ్ డు ప్లెసిస్ 54 పరుగులతో రాణించాడు. అనంతరం రజత్ పాటిదార్ (41), కెమరూన్ గ్రీన్ (38*) అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గొప్ప స్థానానికి తీసుకెళ్లారు. వీరిద్దరూ మూడో వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డారిల్ మిచెల్ చేతిలో పాటిదార్ క్యాచ్న అవుట్ చేయడం ద్వారా ఠాకూర్ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. దీని తర్వాత దినేశ్ కార్తీక్ (14), గ్లెన్ మాక్స్వెల్ (16) మంచి స్కోరును రాబట్టగలిగారు. కామెరాన్ గ్రీన్ 17 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో అజేయంగా 38 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున శార్దూల్ ఠాకూర్ అత్యధికంగా రెండు వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్పాండే, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీశారు.
ఛేదనలో చెన్నై ఆరంభంలోనే 2 వికెట్లను నష్టపోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గోల్డెన్ డక్ తో వెనుదిరిగాడు. ఈ క్రమంలో రచిన్ రవీంద్ర, అజింక్య రహానే స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. రవీంద్ర 61 పరుగులు చేయగా, రహానే 33 పరుగులతో రాణించాడు. చివర్లో ధోనీ, రవీంద్ర జడేజా మ్యాచ్ విజయాన్ని డిసైడ్ చేశారు. అయితే కీలక సమయంలో ధోనీ క్యాచ్ అవుట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఆర్సీబీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ధోనీ 13 బంతుల్లో 25 పరుగులు చేయగా, జడేజా 22 బంతుల్లో 42 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. విశేషం ఏంటంటే ఈ రోజు చివరి ఓవర్ నాటికి జియో సినిమా ఫ్లాట్ ఫార్మ్ లో 46 కోట్ల మంది వీక్షించారు. ఇదే ఇప్పటి వరకు హైయెస్ట్ అని చెప్పాలి.
ఆర్సీబీ జట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్.
చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, రిచర్డ్ గ్లీసన్, సిమర్జీత్ సింగ్, మహేశ్ తిక్షినా సింగ్.
Also Read: RCB vs CSK: చెలరేగిన ఆర్సీబీ టాపార్డర్… సీఎస్కే ముందు 219 టార్గెట్