IPL 2022 : లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా..
ఐపీఎల్ 15వ సీజన్ లో బుధవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలైన టీ ట్వంటీ మజాను పంపించింది. ఆధిపత్యం చేతులు మారుతూ చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో గుజరాత్ టైటాన్స్ ఆఖరి బంతికి విజయం సాధించింది.
- By Naresh Kumar Published Date - 12:34 PM, Thu - 28 April 22
ఐపీఎల్ 15వ సీజన్ లో బుధవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలైన టీ ట్వంటీ మజాను పంపించింది. ఆధిపత్యం చేతులు మారుతూ చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో గుజరాత్ టైటాన్స్ ఆఖరి బంతికి విజయం సాధించింది. చివరి ఓవర్లలో విజయం కోసం 22 రన్స్ చేయాల్సి ఉండగా… రషీద్ ఖాన్ మెరుపు బ్యాటింగ్ తో గుజరాత్ ను గెలిపించాడు. తొలి బంతికి తెవాటియా సిక్సర్ కొడితే తర్వాత రషీద్ మూడు సిక్సర్లు బాదాడు. ఈ విజయంతో లీగ్ ఫస్టాఫ్ లో ఎదురైన పరాజయానికి గుజరాత్ రివేంజ్ తీర్చుకున్నట్టైంది. ఇదిలా ఉంటే తాజాగా రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ చివరి ఓవర్ పై స్పందించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై రెచ్చిపోవడం మంచి కిక్ ఇచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
గత సీజన్ వరకూ హైదరాబాద్ కే ఆడిన రషీద్ ఖాన్ ను సన్ రైజర్స్ రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేసింది. రిటెన్షన్ ప్రక్రియ సమయంలో రషీద్ తో మేనేజ్ మెంట్ కు మధ్య జరిగిన చర్చ సన్ రైజర్స్ అసహనం కలిగించినట్టు వార్తలు వచ్చాయి. మొదటి ప్రాధాన్యతగా తననే రిటైన్ చేసుకోమని రషీద్ కోరడం , సన్ రైజర్స్ తిరస్కరించింది. అయితే వేలానికి ముందే గుజరాత్ టైటాన్స్ ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ ను 15 కోట్లతో రిటైన్ చేసుకుంది. సన్ రైజర్స్ తనను రిటైన్ చేసుకోలేదన్న కోపమే మరేంటో తెలీదు కానీ గత మ్యాచ్ అనంతరం రషీద్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఇన్నింగ్స్ ఇచ్చిన ఫీలింగ్ బాగుందన్న రషీద్ ఖాన్ క్రీజులోకి వెళ్లడం, ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం, బలంగా సిక్సర్లు కొట్టడం అన్నీ అనుకున్నట్లు జరిగాయన్నాడు.
ముఖ్యంగా సన్ రైజర్స్ మీద ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం మరింత సంతోషాన్నిచ్చిందన్నాడు. గత కొన్నేళ్ళుగా తన బ్యాటింగ్ మెరుగుపరుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. సన్ రైజర్స్ చివరి ఓవర్లో 25 పరుగులు చేసినప్పుడే మనం కూడా ప్రయత్నిద్దామంటూ తేవాటియాతో చెప్పానని రషీద్ తెలిపాడు. కాగా ఈ మ్యాచ్ లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన రషీబ్ బౌలింగ్ లో మాత్రం తేలిపోయాడు. సీజన్ లోనే అత్యంత పేలవ బౌలింగ్ తో నిరాశపరిచాడు. 4 ఓవర్లలో ఒక వికెట్ కూడా తీయని రషీద్ ఖాన్ 45 పరుగులు ఇచ్చాడు. అ ఈ మ్యాచ్ లో తాను కూడా కొన్ని చెత్త బంతులు వేసానని అంగీకరించాడు. అయితే చివరి ఓవర్లో బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్నందించడంతో ఆ బాధ కాస్త తగ్గిందన్నాడు.
Related News
SRH Playoffs: టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్కు చేరిన సన్రైజర్స్ హైదరాబాద్
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నిరంతర వర్షం కారణంగా మైదానం మొత్తం కవర్లతో కప్పారు.