యాక్సిడెంట్ తర్వాత తొలిసారి స్పందించిన పంత్.. వైరల్ పోస్ట్!
టీమిండియా క్రికెటర్ల జాబితాలో ఎంతో మంచి భవిష్యత్తు కలిగిన యువ క్రికెటర్ గా రిషబ్ పంత్ కు టీంలో గుర్తింపు ఉంది
- By Nakshatra Published Date - 08:52 PM, Mon - 16 January 23
టీమిండియా క్రికెటర్ల జాబితాలో ఎంతో మంచి భవిష్యత్తు కలిగిన యువ క్రికెటర్ గా రిషబ్ పంత్ కు టీంలో గుర్తింపు ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని శిష్యుడిగా ఎంతో గుర్తింపు సాధించిన రిషబ్ పంత్.. కారు ప్రమాదానికి గురి కావడం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 30వ తదీన ఢిల్లీ నుండి డెహ్రాడూన్ వెళుతుండగా.. కారు ప్రమాదానికి గురి కావడం తెలిసిందే.
కారులో ప్రయాణిస్తున్న రిషబ్ పంత్.. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మోకాలికి. నుదుటి పైన, వీపు భాగంగలో బలమైన గాయాలకు గురైన రిషబ్ పంత్ ను ముందుగా చికిత్స కోసం ఢిల్లీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి నుండి ముంబైలోని అంబానీ ఆస్పత్రికి ఎయిర్ లిఫ్ట్ చేశారు. అయితే ఈ ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ తొలిసారి ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
‘క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచి, త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు’ అంటూ టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు. అలాగే తనకు జరిగిన సర్జరీ విజయవంతమైందని, రికవర్ అవుతున్నట్లు తెలిపాడు. అదే సమయంలో రిషబ్ పంత్ రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు.
అయితే కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ కోలుకోవడానికి ఏడాది కాలం పడుతుందని బీసీసీఐ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఏడాది జరిగే ఆస్ట్రేలియా సిరీస్ తో పాటు, ఐపీఎల్ 2023, వరల్డ్ కప్ 2023కి రిషబ్ పంత్ దూరం అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
Related News
Rishabh Pant Banned: ఢిల్లీకి బిగ్ షాక్.. పంత్పై ఒక మ్యాచ్ నిషేధం..?
రిషబ్ పంత్.. కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్ 2024లో ఆడుతున్నాడు. అంతేకాకుండా ఢిల్లీ జట్టుకు కెప్టెన్సీ కూడా వ్యవహరిస్తున్నాడు.