WTC Final 2023: ఇంగ్లండ్ ఓవల్ పిచ్ రిపోర్ట్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. ఓవల్లో టెస్టు కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. రెండు జట్లూ బలంగా కనిపిస్తున్నాయి
- By Praveen Aluthuru Published Date - 07:46 PM, Tue - 6 June 23
WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. ఓవల్లో టెస్టు కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. రెండు జట్లూ బలంగా కనిపిస్తున్నాయి. మరియు ఇరు జట్లలోనూ స్టార్ ప్లేయర్లు కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టైటిల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టమైన పని. అయితే జూన్ 7 నుంచి 12 మధ్య ఇంగ్లండ్ గడ్డపై ఫుల్ ఎంటర్టైన్మెంట్ జరగడం ఖాయం.
ఓవల్లోని పిచ్ పై సాధారణంగా బ్యాట్స్మెన్ ఆధిపత్యం ఉంటుంది. గత పదేళ్లలో ఇంగ్లండ్లోని మిగతా మైదానాలతో పోలిస్తే ఈ మైదానంలో టెస్టుల్లో అత్యంత వేగవంతమైన పరుగులు నమోదయ్యాయి. అయితే జూన్లో ఓవల్లో టెస్టు మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. అటువంటి పరిస్థితిలో పిచ్ చాలా తాజాగా ఉంటుంది. కాగా ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు పిచ్ అనుకూలంగా ఉంటుంది. .
ఓవల్ పిచ్లపై ఫాస్ట్ బౌలర్లు సత్తా చాటుతారు. సాధారణంగా ప్రతి 7, 8 ఓవర్లకి లేదా 30 పరుగుల వద్ద ఇంగ్లండ్లోని ఈ మైదానంలో ఒక వికెట్ పడిపోతుంది. మొదటి రెండు ఇన్నింగ్స్లలో ఫాస్ట్ బౌలర్లు సమర్థంగా రాణిస్తారు. అదే సమయంలో మూడు మరియు నాల్గవ ఇన్నింగ్స్లలో, స్పిన్ బౌలర్లు చెలరేగిపోతాడు.
ఓవల్లో ఇప్పటివరకు మొత్తం 104 టెస్టు మ్యాచ్లు జరగ్గా అందులో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 88 మ్యాచ్ల్లో విజయాన్ని చవిచూసింది. అదే సమయంలో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసిన జట్టు 29 మ్యాచ్ల్లో మాత్రమే గెలవగలిగింది. అంటే WTC ఫైనల్లో టాస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Read More: Diamonds: కర్నూలు జిల్లాలో వజ్రాల వేట.. రాత్రికి రాత్రే కోటిశ్వరుడైన రైతు!
Tags
Related News
India vs Australia: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్.. వేదికలివే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా (India vs Australia)లో పర్యటించనుంది.