MS Dhoni : చెన్నై కెప్టెన్ గా ధోనీనే…
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు గుడ్ న్యూస్...చెన్నై జట్టు సారథిగా ధోనీనే కొనసాగనున్నాడు.
- By Hashtag U Published Date - 12:50 PM, Fri - 28 January 22
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు గుడ్ న్యూస్…చెన్నై జట్టు సారథిగా ధోనీనే కొనసాగనున్నాడు. ప్రస్తుతానికి జట్టు కెప్టెన్సీ ఎటువంటి మార్పులూ ఉండవని సీఎస్ కే యాజమాన్యం స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా చెన్నై కెప్టెన్సీ నుండి ధోనీ తప్పుకోబోతున్నట్టూ, రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత సీజన్ ముగిసిన తర్వాత పరోక్షంగా ధోనీ చేసిన వ్యాఖ్యలే ఈ వార్తలకు కారణమైంది. తన చివరి మ్యాచ్ చెపాక్ స్టేడియంలోనే ఆడతానని చెప్పడంతో 2022 సీజన్ తో ధోనీ కెరీర్ కు వీడ్కోలు పలుకుతాడని భావించారు. అయితే ఇటీవలే ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం వీటిని ఖండించింది. తాజాగా ఆటగాళ్ళ వేలంపై చర్చించేందుకు సమావేశమైన చెన్నై యాజమాన్యం కెప్టెన్సీ మార్పుపై స్పందించింది. జడేజా కొత్త కెప్టెన్ కాబోతున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఈ సీజన్ లోనూ ధోనీనే సారథ్యం వహిస్తాడని క్లారిటీ ఇచ్చింది. సారథిగా ఎప్పుడు తప్పుకోవాలో ధోనీకి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని , ఫ్రాంచైజీ ఈ విషయం అసలు ఆలోచించడం లేదని సీఎస్ కే ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతానికి చెన్నై ఫ్రాంచైజీ దృష్టంతా వేలంపైనే ఉందని తెలిపారు. కాగా ధోనీ సారథ్యం నుండి తప్పుకుంటున్నాడంటూ వచ్చిన వార్తలపైనా కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ సీజన్ తోనే ధోనీ ఐపీఎల్ కెరీర్ ముగుస్తుందన్న వార్తలు కూడా నిజం కావు. ఎందుకంటే ధోనీ చెప్పిన మాట ప్రకారం తన చివరి మ్యాచ్ చెపాక్ స్టేడియంలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ సారి ఐపీఎల్ సీజన్ కేవలం ముంబైలోనే జరగనుండడంతో ధోనీ వచ్చే సీజన్ లోనూ ఖచ్చితంగా ఆడతాడని తెలుస్తోంది. మొత్తం మీద ధోనీ సారథిగా కొనసాగబోతున్నట్టు ఫ్రాంచైజీ చెప్పిన నేపథ్యంలో మహేంద్రుడి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Related News
Royal Challengers Bengaluru: ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే.. ఇలా జరగాల్సిందే..!
బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. RCB- CSK మధ్య జరిగే ఈ మ్యాచ్ ఫైనల్కు ఉండే క్రేజ్ను సాధించింది.