Jonny Bairstow: పంజాబ్ కింగ్స్ కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2022 సీజన్లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది.
- By Naresh Kumar Published Date - 04:36 PM, Fri - 8 April 22
ఐపీఎల్ 2022 సీజన్లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్, హార్దిక్ పాండ్య కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఇవాళ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్ల మధ్య ఈ హోరాహోరీ పోరు రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది. ప్రస్తుత సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి జోరుమీదుండగా.. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి ఉత్సాహంగా ఉంది.
ఇదిలాఉంటే, గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్కు ముందు పంజాబ్ కింగ్స్ కు గుడ్ న్యూస్ అందింది. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా జట్టుకు దూరమైన ఇంగ్లాండ్ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్ స్టో గుజరాత్ తో మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ దృవీకరించింది. ఇటీవల జట్టుతో కలిసిన జానీ బెయిర్ స్టో తన క్వారంటైన్ను పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న అతడు గుజరాత్ టైటాన్స్ తో జరగనున్న మ్యాచ్కు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడు. ఇది మాకు నిజంగా శుభవార్త అని పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది. ఇక పంజాబ్ కింగ్స్ జట్టులోకి జానీ బెయిర్ స్టో రాకతో గత రెండు మ్యాచ్ల్లో బరిలోకి దిగిన భానుక రాజపక్సపై వేటు పడనుంది. ఇదిలాఉంటే.. ఐపీఎల్-2022లో మెగా వేలంలో భాగంగా జానీ బెయిర్ స్టో రూ.6.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో గత మూడు సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్కు ఆడుతున్న బెయిర్స్టో ఇప్పటి వరకు 28 ఐపీఎల్ మ్యాచ్ల్లో 1038 పరుగులు సాధించాడు.
Related News
CSK vs PBKS: చెపాక్ లో చెన్నైని ఓడించిన పంజాబ్
చెన్నై చెపాక్ లో రుతురాజ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు పంజాబ్ షాక్ ఇచ్చింది. స్వల్ప ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు రాణించడంతో విజయం పంజాబ్ సొంతమైంది. ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ పాయింట్ల పట్టికను మెరుగుపరుచుకుని ముందుకు ఎగబాకింది.