IPL Tickets : ఐపీఎల్ టికెట్ల అమ్మకం షురూ
- By Naresh Kumar Published Date - 10:29 PM, Wed - 23 March 22
ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. మే 29 వరకూ జరిగే ఈసారి ఐపీఎల్ లో మొత్తంగా 74 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నెల 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్తో ఈసారి ఐపీఎల్ మొదలు కానుంది. అయితే ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 15వ సీజన్ మహారాష్ట్రలోని నాలుగు వేదికల్లో జరగనుండగా.. ఈ మ్యాచ్లను 25 శాతం మంది అభిమానులను స్టేడియాల్లోకి అనుమతిచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఐపీఎల్ 2022 సీజన్లోని 55 మ్యాచ్లు ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్, డివై పాటిల్ స్టేడియాల్లో.. మిగిలిన 15 మ్యాచ్లు పూణేలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో స్టేడియంలోకి 25 శాతం మంది ఫ్యాన్స్ కు అవకాశం కల్పిస్తే.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో 10,000 మంది, అలాగే బ్రబ్రౌన్ మైదానంలో 8000 మంది, అలాగే డీవై పాటిల్ మైదానంలో 12,000 మంది ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కనుంది. ఇప్పటికే మ్యాచ్ లకు సంబంధించిన టికెట్ల అమ్మకం కూడా ప్రారంభమయింది. అయితే తొలి మ్యాచ్ కు ముందు ఆరంభ వేడుకలు లేకపోవడం ఫాన్స్ కు నిరాశ కలిగించింది. కరోనా కారణంగా ఓపెనింగ్ సెర్మనీ రద్దు చేసినట్టు బీసీసీఐ తెలిపింది.
Tags
Related News
Yuzvendra Chahal: యుజ్వేంద్ర చాహల్ను RCB ఎందుకు రిటైన్ చేయలేదో కారణం చెప్పిన మైక్ హెస్సన్..!
ఐపీఎల్ 2022లో టీమిండియా స్టార్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రిటైన్ చేయలేదు.