CSK PlayOff: చెన్నై ప్లే ఆఫ్ చేరుతుందా ?
ఐపీఎల్15వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మూడో విజయం నమోదు చేయడంతో..
- By Naresh Kumar Published Date - 06:59 PM, Mon - 2 May 22
ఐపీఎల్15వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మూడో విజయం నమోదు చేయడంతో.. ఆ జట్టుకి ఉన్న ప్లేఆఫ్ అవకాశాలపై నెటిజన్లు తెగ శోధిస్తున్నారు. ఐపీఎల్ 2022 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్న చెన్నై టీమ్.. లీగ్ దశలో ఇంకా ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్ల్లోనూ గెలిస్తే అప్పుడు ఆ జట్టు ఖాతాలో మొత్తం 16 పాయింట్లు చేరుతాయి. దాంతో.. 16 పాయింట్లతో ఆ జట్టే ప్లేఆఫ్స్కి అర్హత సాధించగలదా అనేది ఆసక్తికరంగా మారింది. దానికి తోడు చెన్నై టీమ్ నెట్ రన్రేట్ కూడా కాస్త తక్కువగా -0.407గా ఉంది.
ఇక తాజా సీజన్లో మూడో విజయాన్ని అందుకుంది. ఇప్పటికే తొమ్మిది మ్యాచ్లు ఆడేసిన ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో 9వ స్థానంలో ఉండగా.. లీగ్ దశలో ఆ జట్టు ఇంకా ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడనుంది. ప్రస్తుతం పట్టికలో గుజరాత్ టైటాన్స్ జట్టు 16 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా.. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా టాప్-4లో కొనసాగుతున్నాయి. అయితే చెన్నై జట్టు ప్లేఆఫ్స్ కు చేరాలంటే మిగతా జట్ల గెలుపోటములుపై కూడా ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎందుకంటే ప్రస్తుతం ఒక్క కోల్ కత్తా మినహా అన్ని జట్లూ చెన్నై సూపర్ కింగ్స్ కంటే ఎక్కువ పాయింట్లు కలిగి ఉన్నాయి. అలానే చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ఆడబోయే ఐదు మ్యాచుల్లోనూ గెలిచి తీరాలి. ఒకవేళ ఒక్క చెన్నై ఒకదాంట్లో ఓటమిపాలైనా కూడా ప్లేఆఫ్స్కి చేరడం కష్టమే అని చెప్పొచ్చు.. ఒక వేళ చెన్నై జట్టు వరుసగా ఐదు విజయాలు సాదించినప్పటికీ నెట్ రన్రేట్ తక్కువగా ఉండడంతో మిగిలిన జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి మిగతా జట్ల ప్రదర్శన కలిసొస్తే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ లో అడుగుపెడుతుంది.
Related News
Team India Squad: ఏ ఫ్రాంచైజీ నుండి ఎంతమంది ఆటగాళ్లకు టీమిండియాలో చోటు దక్కింది..?
పీఎల్ 2024 మధ్య టీ20 ప్రపంచకప్ 2024 కోసం టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ అధికారులు ప్రకటించారు. యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో జట్టు చాలా సమతుల్యంగా కనిపిస్తుంది.