IPL 2022 Venue : ఐపీఎల్ 2022 సీజన్ ఎక్కడో తెలుసా..
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ 15వ సీజన్ వేదిక ఖరారైంది. ఈ సారి భారత్ లోనే ఈ మెగా లీగ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
- By Hashtag U Published Date - 11:47 AM, Fri - 28 January 22
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ 15వ సీజన్ వేదిక ఖరారైంది. ఈ సారి భారత్ లోనే ఈ మెగా లీగ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కోవిడ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో 2022 సీజన్ ను ఒక రాష్ట్రానికి పరిమితం చేయాలని డిసైడయింది. ముంబై, పుణేలలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించబోతున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 20న దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సీజన్ను భారత్లో నిర్వహించేందుకు బోర్డు కట్టుబడి ఉందని బీసీసీఐ వర్గాలు మరోసారి స్పష్టం చేశాయి. ఇప్పటికే పలుసార్లు ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముంబైని వేదికగా ఖరారు చేసినట్టు సమాచారం. కోవిడ్ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటే సెకండ్ ఆప్షన్ గా సౌతాఫ్రికాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. లీగ్ నిర్వహణకు తక్కువ ఖర్చుతో తాము సిద్ధమని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా చెప్పడంతో బీసీసీఐకి పెద్ద టెన్షన్ తీరిపోయింది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఆంక్షలు సడలింపులు కూడా మంచి పరిణామంగా చెబుతున్నారు.స్కూల్స్, కాలేజీలు రీఓపెన్ చేయడంతో పాటు కేసుల సంఖ్య తగ్గడంతో బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఊపిరి పీల్చుకున్నాయి.
టోర్నమెంట్ మ్యాచ్లు ముంబైలోని వాంఖడే, డివై పాటిల్ , బ్రబౌర్న్ స్టేడియంలో మూడు స్టేడియాలలో జరుగుతాయని బోర్డు వర్గాల తెలిపాయి. దీనితో పాటు కొన్ని మ్యాచ్లను కూడా పూణేలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ సారి రెండు కొత్త జట్ల రాకతో టోర్నీ సుదీర్ఘంగా జరగనుంది. మార్చి 27న ప్రారంభం కానున్న ఐపీఎల్ లో ఈ సారి 74 మ్యాచ్ లు అభిమానులను అలరించనున్నాయి. కాగా ముంబైలో టోర్నీ నిర్వహించేందుకు అనుమతులు కోరుతూ ఇప్పటికే అక్కడి ప్రభుత్వ వర్గాలను కూడా బోర్డు అధికారులు సంప్రదించారు. అలాగే ఎంసీఎ తరపున శరద్ పొవార్ ను కూడా బోర్డు పెద్దలు కలిసి విజ్ఞప్తి చేశారు. దానికి పొవార్ , ఎంసీఎ, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో బీసీసీఐ ఐపీఎల్ 2022 సీజన్ వేదికగా ముంబైని ఖరారు చేసుకుంది. పుణేలోనూ అత్యుత్తమ సౌకర్యాలు ఉండడంతో సీజన్ మొత్తానికి మహారాష్ట్రనే వేదిక కానుంది. అయితే కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఈ సారి మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. అలాగే బయోబబూల్ ను మరింత పకడ్బందీగా ప్లాన్ చేయబోతోంది. గత సీజన్ లో బబూల్ బ్రేక్ కావడంతోనే సీజన్ మధ్యలోనే నిలిచిపోయింది. ఆ తర్వాత యుఏఈ వేదికగా సీజన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో ఈ సారి అలాంటి తప్పిదాలు రిపీట్ కాకుండా ఫ్రాంచైజీలకు, ఆటగాళ్ళకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనుంది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఆటగాళ్ళ మెగా వేలం జరగనుంది.
Tags
Related News
IPL 2022: గిన్నిస్ బుక్ లో ఐపీఎల్ 2022 ఫైనల్
ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెర తీసిన ఐపీఎల్ కు గిన్నిస్ బుక్ లో చోటు దక్కింది.