Ind Vs SL 2nd Test : క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా బెంగళూరు వేదికగా మార్చి 12న భారత్- శ్రీలంక జట్ల రెండో టెస్టు ప్రారంభం కానుంది.
- By Naresh Kumar Published Date - 12:15 PM, Fri - 11 March 22
రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా బెంగళూరు వేదికగా మార్చి 12న భారత్- శ్రీలంక జట్ల రెండో టెస్టు ప్రారంభం కానుంది.. అయితేఈ టెస్ట్ మ్యాచ్ను డే అండ్ నైట్ టెస్ట్ అంటే పింక్ బాల్ టెస్టుగా నిర్వహించబోతున్నట్టు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ రెండో టెస్టు ముంగిట క్రికెట్ ఫ్యాన్స్ కు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరులో జరుగనున్న ఈ రెండో టెస్టుకు 100శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతినిచ్చింది. అయితే అంతకుముందు 50 శాతం మంది ప్రేక్షకులకే స్టేడియంలోకి ఎంట్రీ ఉండగా ప్రస్తుతం మన దేశంలో కరోనా ఉధృతి తగ్గడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుకర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం వెల్లడించింది.
పింక్ బాల్ టెస్టు కావడంతో ఈ మ్యాచ్కి ఫుల్లు డిమాండ్ ఏర్పడింది. టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. అదీకాకుండా బెంగళూరులో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. దీంతో కరోనా ఆంక్షలు కూడా తొలగించారు.ఇదిలావుంటే మొహాలీ వేదికగా భారత్,శ్రీలంక మదేక్ జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.. తొలుత బ్యాటింగ్ లో 175 పరుగులతో రాణించిన జడేజా అనంతరం బౌలింగ్ లో 9 వికెట్లు తీశాడు. మరోవైపు ఈ రెండో టెస్టు ముంగిట టీమిండియా జట్టులోకి సీనియర్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. దాంతో.. అక్షర్ పటేల్ స్థానంలో ప్రస్తుతం జట్టులో ఉన్న సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టీమిండియాను వీడనున్నాడు.
Tags
Related News
IPL 2024: ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు, సిక్సులు, వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ -2024 లీగ్ రౌండ్ ముగిసింది. ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది.