India Playing XI 2nd T20 : మరో సిరీస్ విజయంపై కన్నేసిన భారత్
సొంత గడ్డ పై టీమ్ ఇండియా మరో సిరీస్ విజయం లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
- By Naresh Kumar Published Date - 04:59 PM, Sat - 26 February 22
సొంత గడ్డ పై టీమ్ ఇండియా మరో సిరీస్ విజయం లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ ట్వంటీ లో భారత్ 62 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 57 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 89 పరుగులతో దుమ్మురేపాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ 44 పరుగులు సాధించగా.. శ్రేయాస్ అయ్యర్ 57 పరుగులతో అర్థ శతకం సాధించాడు. దీంతో సీరీస్ లో 1-0తో ఆధిక్యాన్ని అందుకున్న రోహిత్ సేన ఇప్పుడు ధర్మశాల వేదికగా రెండో మ్యాచ్ కు సిద్ధమయింది. మరోవైపు సిరీస్ను కాపాడుకోవాలంటే శ్రీలంకకు గెలుపు తప్పనిసరి. అయితే గత మ్యాచ్లో వచ్చిన రిజల్ట్ , బలాబలాలు చూస్తే టీమిండియాను అడ్డుకోవడం లంకేయులకు సాధ్యం కాకపోవచ్చు. ఇక ఈ మ్యాచ్కి భారత్ తుది జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. దీపక్ హుడా స్థానంలో కుల్దీప్ యాదవ్ రానున్నాడు… అయితే ఈ మ్యాచ్ లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ని ఆడించాలని భావించినా.. మణికట్టు గాయం కారణంగా ఈ సీరీస్ కు అతను దూరమయ్యాడు. అతని స్థానంలో బీసీసీఐ మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేసింది.
ఇక రెండో టీ ట్వంటీ కి సంబంధించి భారత్ తుదిజట్టులో.. రోహిత్ శర్మ , ఇషాన్ కిషన్ , శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ చోటు దక్కించుకునే అవకాశం ఉంది… ఇక భారత్, శ్రీలంక మధ్య ముఖాముఖి రికార్డులు చూస్తే ఇప్పటి వరకూ ఈ రెండు జట్లూ 23 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ జట్టు 15 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. శ్రీలంక 7 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు.
Tags
Related News
RR vs PBKS: బట్లర్ లేకుండానే బరిలోకి.. రాజస్థాన్ రాయల్స్ లో మైనస్ అదే
రాజస్థాన్ ఆడబోయే మిగతా మ్యాచ్ ల్లో జొస్ బట్లర్ లేకపోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లాండ్ ప్లేయర్స్ తమ దేశానికి తిరిగిరావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశించింది. దీంతో బట్లర్ జట్టుని వీడి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు.