Thomas Cup:థామస్ కప్ మనదే..ఫైనల్స్ చిరాగ్, సాయిరాజ్ జోడి విజయం..!!
థామస్ కప్ టోర్నీ భారత్ ను వరించింది. డబుల్స్ టైటిల్స్ లో ఫైనల్ చేరిన భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాక్ శెట్టి టైటిల్ పోరులో సత్తా చూపించారు.
- By Hashtag U Published Date - 04:00 PM, Sun - 15 May 22
థామస్ కప్ టోర్నీ భారత్ ను వరించింది. డబుల్స్ టైటిల్స్ లో ఫైనల్ చేరిన భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాక్ శెట్టి టైటిల్ పోరులో సత్తా చూపించారు. ఇండోనేషియాకు చెందిన అసాన్ సంజయ జోడిపై విజయం సాధించారు. మూడు సెట్ల పాటు సాగిన టైటిల్ వేటలో సాత్విక్, చిరాగ్ జోడి 18-21, 23-21, 21-19తో గెలిచారు. మొదటిసెట్ ను ఓడి డిఫెన్స్ పడిపోయినట్లుగా కనిపించిన సాయిరాజ్, చిరాగ్ ల జోడి వెంటనే ఫాంలోకి వచ్చారు. మొదటి సెట్ తర్వాత రెండు మూడు సెట్లను వరుసగా నెగ్గింది.
HISTORY CREATED AT BANGKOK
For the first time in HISTORY, India wins the Thomas cup. #ThomasCup2022 #ThomasCup #ThomasUberCup2022 pic.twitter.com/LdOpP3gHfg
— Aditya Kumar (@adityavaisya) May 15, 2022
కాగా థామస్ కప్ చరిత్రలో మొదటిసారి ఫైల్ చేరిన భారత జోడిగా ఇప్పటికే సాయిరాజ్, చిరాగ్ ల జోడి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఫైనల్లో వీరు పోటీ పడాల్సిన ఇండోనేషియా జట్టు మాత్రం అప్పటికే 14 టైటిళ్లు గెలించి స్ట్రాంగ్ గా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఫైనల్లో ఏదో అద్భుతం జరిగితే కానీ…భారత్ కు టైటిల్ దక్కదన్న వాదనలు వినిపించినా….ఈ వాదనలకు చెక్ పెట్టిన సాయిరాజ్, చిరాగ్ జోడి భారత్ కు థామస్ కప్ లో తొలి టైటిల్ ను అందించారు.
As #TeamIndia defeats 14-time #ThomasCup Champions Indonesia (🇮🇳3-0🇮🇩) to win its 1️⃣st ever #ThomasCup2022, @IndiaSports is proud to announce a cash award of ₹ 1 crore for the team in relaxation of rules to acknowledge this unparalleled feat!
Congratulations Team India!! https://t.co/QMVCvBDDZS
— Anurag Thakur (@ianuragthakur) May 15, 2022
Related News
Kidambi Srikanth: ఇండియా థామస్ కప్ను గెలిచింది అంటుంటే గర్వంగా ఉంది: స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 సార్లు థామస్ కప్ ఛాంపియన్ ఇండోనేషియా ను ఇటీవల ఇండియా ఓడించి కప్ ను కైవసం చేసుకుంది.