World Cup Prize Money: వరల్డ్ కప్ ప్రైజ్ మనీ రూ.83 కోట్లలో ఎవరి వాటా ఎంత..? ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు ఎంతంటే..?
ప్రపంచ కప్ 2023లో మొత్తం 10 మిలియన్ డాలర్లు అంటే రూ. 83 కోట్ల ప్రైజ్ మనీ (World Cup Prize Money) ఉంది. ఈ ప్రైజ్ మనీలో ఎక్కువ భాగం నవంబర్ 19న ప్రపంచ ఛాంపియన్గా మారే జట్టు ఖాతాకు చేరుతుంది.
- By Gopichand Published Date - 02:54 PM, Fri - 17 November 23
World Cup Prize Money: ప్రపంచ కప్ 2023లో మొత్తం 10 మిలియన్ డాలర్లు అంటే రూ. 83 కోట్ల ప్రైజ్ మనీ (World Cup Prize Money) ఉంది. ఈ ప్రైజ్ మనీలో ఎక్కువ భాగం నవంబర్ 19న ప్రపంచ ఛాంపియన్గా మారే జట్టు ఖాతాకు చేరుతుంది. రన్నరప్గా నిలిచిన జట్టు కూడా భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకోనుంది. దీంతో పాటు ఈ ప్రపంచకప్లో లీగ్ దశలో నిష్క్రమించిన జట్లు, సెమీఫైనల్లో ఓడిన జట్లకు కూడా మంచి మొత్తమే దక్కనుంది. ఈ ప్రైజ్ మనీ రూ.83 కోట్లలో ఎవరి వాటా ఎంత మొత్తం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..!
– ప్రపంచ కప్ 2023 ఛాంపియన్ జట్టుకు $4 మిలియన్ల ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది. భారత కరెన్సీలో చూస్తే ఈ మొత్తం రూ.33 కోట్ల కంటే ఎక్కువ. ఈ భారీ మొత్తం భారత్ లేదా ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.
– ప్రపంచ కప్ 2023 ఫైనల్లో ఓడిపోయిన జట్టు అంటే ఈ టోర్నమెంట్లో రన్నరప్ జట్టుకు 2 మిలియన్ డాలర్లు అంటే రూ. 16.65 కోట్లు.
– సెమీ ఫైనల్ మ్యాచ్ల్లో ఓడిన రెండు జట్ల ఖాతాల్లోకి మొత్తం 1.6 మిలియన్ డాలర్లు చేరుతాయి. ఇక్కడ ఒక్కో జట్టు వాటా 8 లక్షల డాలర్లు (6.65 కోట్ల రూపాయలు) ఉంటుంది. ఈ మొత్తం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లకు చేరనుంది. సెమీ ఫైనల్ మ్యాచ్ల్లో ఇరు జట్లు ఓడిపోయాయి.
– లీగ్ దశ తర్వాత ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన ఆరు జట్లకు ఒక్కొక్కరికి లక్ష డాలర్లు (రూ. 83 లక్షలు) అందుతాయి. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్ ఈ మొత్తాన్ని అందుకోనున్నాయి. అంటే ఈ 6 జట్లకు మొత్తం రూ.5 కోట్లు దక్కనున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
– లీగ్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచినందుకు జట్లకు మంచి మొత్తంలో ప్రైజ్ మనీ ఫిక్స్ చేయబడింది. ఇక్కడ ఒక్కో మ్యాచ్లో గెలిచిన జట్టుకు 40 వేల డాలర్లు అంటే 33 లక్షల రూపాయలు. ఈ విధంగా లీగ్ దశలో 45 మ్యాచ్ల ప్రైజ్ మనీ మొత్తం 1.8 మిలియన్ డాలర్లు అంటే రూ.15 కోట్లు.
Tags
Related News
India vs Australia: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్.. వేదికలివే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా (India vs Australia)లో పర్యటించనుంది.