Girl attack: సెల్ఫీ కోసం క్రికెటర్పై అమ్మాయి దాడి… నెట్టింట్లో వీడియో వైరల్!
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషా ముంబయిలో తన స్నేహితుడితో కలిసి స్టార్ హోటల్కు వెళ్లారు. అక్కడ సెల్ఫీ ఇవ్వలేదంటూ కొందరు వ్యక్తులు
- By Nakshatra Published Date - 08:38 PM, Thu - 16 February 23
Girl attack: టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషా ముంబయిలో తన స్నేహితుడితో కలిసి స్టార్ హోటల్కు వెళ్లారు. అక్కడ సెల్ఫీ ఇవ్వలేదంటూ కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన నేడు వెలుగులోకి వచ్చింది. వారిలో ఓ మహిళ కూడా ఉండడం గమనార్హం.
నిన్న పృథ్వీ షా తన స్నేహితుడు ఆషిక్ సురేంద్రతో కలిసి మంబయిలోని శాంతాక్రజ్లో ఉన్న ఓ స్టార్ హోటల్కు వెళ్లాడు. కొందరు వ్యక్తులు సెల్ఫీ కావాలంటూ పృథ్వీ షాని కోరారు. వారిలో ఇద్దరితో మాత్రమే సెల్ఫీ దిగేందుకు షా సమ్మతించాడు. అయితే ఆ బృందంలోని మిగతా వారు కూడా వచ్చి సెల్ఫీ ఇవ్వాలంటూ పట్టుబట్టారు.
తాను మిత్రుడితో డిన్నర్కు వచ్చానని, అందరికీ సెల్ఫీలు ఇచ్చేందుకు ఇది సమయం కాదని పృథ్వీ షా తెలిపాడు. అయిన్పటికీ వారు ఒత్తిడి చేయడంతో, పృథ్వీ షా స్నేహితుడు ఆషిక్ సురేంద్ర హోటల్ మేనేజర్కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన మేనేజర్ అక్కడికి చేరుకుని ఆ వ్యక్తులను పంపించివేశాడు.
అనంతరం భోజనం ముగించుకున్న పృథ్వీ షా, అతడి స్నేహితుడు హోటల్ బయటికి రాగానే సెల్ఫీలు అడిగిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పృథ్వీ షా ఎక్కిన బీఎండబ్ల్యూ కారుపై బేస్ బాల్ బ్యాట్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి చేసిన వారిలో ఓ మహిళ కూడా ఉండన్నారు. ఆమెను నిలువరించేందుకు పృథ్వీ షా ప్రయత్నించాడు.
ఈ నేపథ్యంలో గొడవ మరింత పెద్దది కాకుండా స్నేహితుడు ఆషిక్ సురేంద్ర.. పృథ్వీ షాను మరో కారులో అక్కడి నుంచి పంపించివేశాడు. సురేంద్ర మరో కారులో వెళ్లిపోయే ప్రయత్నం చేయగా, ఓ పెట్రోల్ పంప్ వద్ద సదరు బృందంలోని ఓ మహిళ అతడి కారును అడ్డగించింది. డబ్బులు డిమాండ్ చేసింది. 50 వేలు ఇవ్వకపోతే తప్పుడు కేసు పెడతామని బెదిరించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.
Related News
MI vs DC: వాంఖడేలో ముంబై జోరు, సీజన్లో తొలి విజయం
వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్ లో ముంబైకి ఇదే తొలి విజయం.