England on Top: పట్టు జారవిడిచారు… విజయం దిశగా ఇంగ్లాండ్
మూడు రోజుల పాటు ఆధిపత్యము కనబరిచిన భారత్ ఇప్పుడు కీలక సమయంలో పట్టు జారవిడిచింది.
- By Naresh Kumar Published Date - 11:56 PM, Mon - 4 July 22
మూడు రోజుల పాటు ఆధిపత్యము కనబరిచిన భారత్ ఇప్పుడు కీలక సమయంలో పట్టు జారవిడిచింది. ఫలితంగా బర్మింగ్ హామ్ టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ విజయం దిశగా సాగుతోంది. భారత్ ఉంచిన 378 పరుగుల టార్గెట్ చేధించే క్రమంలో ఇంగ్లాండ్ కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వన్డే తరహాలో చెలరేగి ఆడారు. ఓపెనర్లు లీస్, క్రాలీ కలిసి తొలి వికెట్కు 21.4 ఓవర్లలోనే 107 రన్స్ జోడించారు.
అయితే టీ సమయానికి కాస్త ముందు క్రాలీ 46ని బుమ్రా ఔట్ చేశాడు. కాసేపటికే ఓలీ పోప్ , హాఫ్ సెంచరీ చేసిన లీస్ కూడా ఔటవడంతో ఇంగ్లండ్ 109 రన్స్కే 3 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడినట్లు కనిపించింది. అయితే ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బెయిర్స్టో.. రూట్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. భారత్ బౌలర్లు వికెట్ తీయకపోగా.. ప్రతి ఓవర్కూ ఓ బౌండరీ ఇచ్చుకోవడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు తిరిగింది. భారత్ తరఫున కెప్టెన్ బుమ్రా తప్ప మిగతా బౌలర్లంతా తేలిపోయారు.
రూట్, బెయిర్స్టో నాలుగో వికెట్కు అజేయంగా 151 రన్స్ జోడించారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లకు 260 రన్స్ చేసింది.
ఐదో రోజు ఆట మిగిలి ఉండగా విజయం కోసం ఇంగ్లాండ్ ఇంకా 118 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. రూట్ 76 నాటౌట్ , బెయిర్స్టో 73 నాటౌట్ క్రీజులో. ఉండగా కెప్టెన్ బెన్ స్టోక్స్, సామ్ బిల్లింగ్స్ రూపంలో ఇంకా ఇద్దరు మంచి బ్యాటర్లు కూడా ఆ టీమ్కు ఉండడంతో ఇంగ్లాండ్ విజయం లాంఛనమే. అంతకుముందు నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్లో రెండో ఇన్నింగ్స్లో భారత్ 245 పరుగులకు ఆలౌటైంది. పుజారా , రిషబ్ పంత్ మాత్రమే హాఫ్ సెంచరీలతో రాణించారు.
https://twitter.com/BCCI/status/15440141387870412821544014138787041282
Related News
CSK vs PBKS: చెన్నై చెపాక్ లో కీలక పోరు.. చెన్నై vs పంజాబ్
చెన్నై చెపాక్ లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైండ్. ఈ పిచ్ పై చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్పై చెన్నై జాగ్రత్తగా ఆడాల్సి ఉందంటున్నారు క్రికెట్ అనలిస్టులు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోగలుగుతుంది.