Virat Kohli: కోహ్లీ కెరీర్కు 15 ఏళ్లు.. గురువును గుర్తు చేసుకుంటూ ఎమోషనల్
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ను చూసేవారిలో విరాట్ కోహ్లీ అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. ప్రపంచవ్యాప్తంగా అన్ని
- By Nakshatra Published Date - 08:26 PM, Thu - 11 May 23
Virat Kohli: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ను చూసేవారిలో విరాట్ కోహ్లీ అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో క్రికెట్ అభిమానులు ఉన్నారు. వారిలో కూడా కోహ్లీకి ఎంతోమంది ఉన్నారు. ఇండియన్స్ క్రికెట్ అభిమానులు కాకుండా విదేశీ క్రికెట్ అభిమానులు కూడా కోహ్లీని ఇష్టపడతారు. క్రికెట్ను చూసేవారు కాదు.. క్రికెటర్లలో కూడా కోహ్లీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. దాయాది పాకిస్తాన్ లో కూడా కోహ్లీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
పాకిస్తాన్ క్రికెటర్లు కూడా కోహ్లీని ఇష్టపడతారట. అయితే కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి నేటితో 15 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా కోహ్లీ క్రికెట్ అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారికి కోహ్లీ అభినందనలు చెబుతున్నారు. క్రికెట్లోకి వచ్చి 15 ఏళ్లు అవ్వడంతో కోహ్లీ తన చిన్ననాటి కోచ్ ను గుర్తు చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీతో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తన గురు భక్తని కోహ్లీ చాటుకున్నాడు. తన చిన్ననాటి కోచ్, మెంటార్ రాజ్ కుమార్ శర్మకు పాదాభివందనం చేశారు.
ఈ క్రమంలో తాజా రాజ్ కుమార్ గురించి కోహ్లీ ఓ పోస్టు రావాడు. తాను అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టడంలో రాజ్ కుమార్ కీలక పాత్ర పోషించారని, చిన్ననాటి నుంచి తనకు ప్రోత్సాహం అందించారని చెప్పారు. తాను ఎప్పటికీ రాజ్కుమార్కు రుణపడి ఉంటానని, కేవలం కోచ్గానే కాకుండా తన క్రీడా ప్రయాణంలో మార్గదర్శకుడిగా రాజ్ కుమార్ ఎప్పుడూ అండగా ఉన్నారని తెలిపాడు. భారత జెర్సీని వేసుకోవాలనే తన కలను నిజం చేసుకోవడంతో రాజ్ కుమార్ సర్ తనకు ఎంతో అండగా నిలిచారని కోహ్లీ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ పాఠాలు, తాను కష్టాలు ఎదుర్కొన్న సమయంలో ఆయన వెన్నంటి ఉన్నారని అన్నాడు. రాజ్ కకుమార్ కు ప్రతిక్షణం ధన్యవాదాలు చెప్పాలని ఉందన్నాడు.
Tags
Related News
Dhoni Bowling: ఆర్సీబీతో మ్యాచ్ లో ధోనీ బౌలింగ్..
ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలు ముగుస్తున్న తరుణంలో రేపు శనివారం మరో కీలక మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఆతిథ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్పైనే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక ఆర్సీబీని ఎదుర్కొనేందుకు ధోనీ కొత్త బాధ్యత తీసుకోవాలని నిర్ణ