YSRCP : మరో కొత్త కార్యక్రమం చేపడుతున్న వైసీపీ.. పథకాలు పొందే వారి ఇళ్లకు..!
వైసీపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమంతో ముందుకు వస్తుంది. ఇప్పటికే గడపగడపకు వైసీపీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా
- By Prasad Published Date - 08:30 AM, Wed - 8 February 23
వైసీపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమంతో ముందుకు వస్తుంది. ఇప్పటికే గడపగడపకు వైసీపీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి చేధు అనుభవం ఎదురవుతుంది. అయితే తాజాగా మరోకొత్త ప్రోగ్రాంని తెరమీదకు తెచ్చింది. ప్రభుత్వ పథకాలు పొందే వారి ఇళ్లకు “మా నమ్మకం నువ్వే జగన్” స్టిక్కర్లు వేయాలని నిర్ణయించింది. ఈ నెల 11న వైసీపీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రభుత్వ పథకాలు అందుతున్న ఇళ్ల వివరాలు సేకరించి ఆ ఇళ్లకు స్టిక్కర్లు వేయనున్నారు.. గృహసారధులు, వాలంటీర్ల సమన్వయంతో అలాంటి ఇళ్లను గుర్తించనున్నారు. ఆ ఇంటికి “మా నమ్మకం నువ్వేజగన్” అనే ట్యాగ్లైన్తో జగన్ స్టిక్కర్ వేయబోతున్నారు. ఇంటి యజమాని అనుమతితోనే స్టిక్కర్ వేయాలని నిర్ణయించారు.
Related News
CM Jagan : జగన్ ఉక్కు ప్రామిస్.. రియాలిటీలో తుక్కు ప్రామిస్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రతినిధి బృందం ఆయనను కలిసి ఈ అంశంపై స్పష్టమైన వైఖరిని కోరింది.