CM Jagan : ఆత్మకూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్… ప్రభుత్వం చేసిన మంచి పనులే ..!
- By Prasad Published Date - 03:46 PM, Sun - 26 June 22
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ ఘనవిజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు, గౌతంరెడ్డికి నివాళులు అర్పిస్తూ ప్రజలు 83 వేల ఓట్ల మెజారిటీనిచ్చారని సీఎం ట్వీట్ చేశారు. విక్రమ్రెడ్డికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్.. ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించింది. ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి 82,888 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్కుమార్కు 19,352 ఓట్లు వచ్చాయి.
ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా… ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి… ప్రతి అవ్వకు, ప్రతి తాతకు… పేరుపేరునా ధన్యవాదాలు! (1/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2022
Related News
CBN : జగనన్న బాణం రివర్స్ గేర్ లో వస్తోంది.. పులివెందుల్లో కూడా టీడీపీనే – చంద్రబాబు
ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు సీఎం జగన్ రెడ్డి చేసిందేంటని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిలదీశారు. ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.“ ‘రా…కదలిరా’ అని పిలుపిస్తే కమలాపురం కాలుదువ్విందని.. కడపలో గడపగడపా యుద్ధానికి సిద్ధమంటోందని తెలిపారు. కమలాపురం సభకు వచ్చిన జనమంతా తాను చేస్తున్న