YCP : కృష్ణాజిల్లాలో వైసీపీ షాక్.. రాజీనామా చేసిన జెడ్పీటీసీ..!
కృష్ణాజిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఉయ్యురు వైసిపి జడ్పిటిసి యలమంచిలి పూర్ణిమ తన
- By Prasad Published Date - 02:35 PM, Tue - 16 August 22
కృష్ణాజిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఉయ్యురు వైసీపీ జెడ్పీటీసీ యలమంచిలి పూర్ణిమ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని ఈరోజు మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకి అందించారు. ప్రజా ప్రతినిధి అయిన తనకు పార్టీ పెద్దలు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని గత కొన్ని రోజులుగా జెడ్పీటీసీ పూర్ణిమ ఆవేదనలో ఉన్నారు. పార్టీ పెద్దల నియంత్రత్వ ధోరణి కారణంగానే పూర్ణిమ రాజీనామా చేశారని ఆమె అనుచరులు అంటున్నారు. అధికార పార్టీలో మహిళ ప్రజా ప్రతినిధులకు సరైన గౌరవం లేదంటూ ఆవేదన తో రాజీనామా చేస్తున్నట్లు అనుచరులు వెల్లడించారు.
Related News
Vallabhaneni Vamsi : వంశీ తన ఓటమిని ముందుగానే గ్రహించాడా..?
ఏపీ రాజకీయాలు అంటే గుర్తుకు వచ్చేవి వైఎస్సార్సీపీ, టీడీపీ పార్టీలు. అయితే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ జరిగింది. ఈ సారి టీడీపీ కూటమి గెలిపించేందుకు ఎక్కడెక్కడో ఉన్న ఆంధ్రావాసులు తమ సొంతూళ్లకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.