Yadadri Brahmotsavam: మహావిష్ణు అలంకరణలో యాదాద్రీశుడు
స్వామివారు శ్రీ మహావిష్ణు అలంకారంలో గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
- By Balu J Published Date - 03:22 PM, Wed - 1 March 23
యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం స్వామివారు శ్రీ మహావిష్ణు అలంకారంలో గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకుల ఆధ్వర్యంలో యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, పారాయణీకుల మంతోచ్ఛరణల మధ్య స్వామివారు మాఢవీధుల్లో విహరించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యారాధనల అనంతరం చతుస్థానార్చనలు, మండపారాధనలు, మూలమంత్రజపాలు, ద్వారతోరణ పూజలు, దివ్య ప్రబంధాలు తదితరుల కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ నిర్వహకులు తెలిపారు.
Related News
Srisailam: రేపు శ్రీశైలంలో కుంభోత్సవం.. జరిగే పూజలివే
Srisailam: శ్రీశైలంలో శుక్రవారం భ్రమరాంబాదేవికి కుంభోత్సవం జరుగనున్నది. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో (ఏరోజు ముందుగా వస్తే ఆ రోజున) ఈ ఉత్సవం నిర్వహించబడుతోంది. ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాత కాలపూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుం�