HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Woman Dies In Nagrakurnool Doctor Forgets Cotton In Womans Stomach During Operation

Nagrakurnool: మహిళా ప్రాణాలు తీసిన వైద్యుల నిర్లక్ష్యం, ఆపరేషన్ చేసి, కడుపులో దూది మరిచిపోయి!

వైద్యులు కడుపులో పత్తిని మరిచిపోయి కుట్లు వేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ వారం రోజులకే మృతి చెందింది.

  • By Balu J Published Date - 05:21 PM, Wed - 23 August 23
  • daily-hunt
Crime
Crime

వైద్యుల నిర్లక్ష్యం వల్ల నాగర్‌కర్నూల్‌లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అదే ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయగా వైద్యులు కడుపులో పత్తిని మరిచిపోయి కుట్లు వేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ వారం రోజులకే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన బంధువులు మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఆగస్టు 15న ఆమెకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం రోజునే వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సమయంలో వైద్యులు కడుపులో పత్తిని మరిచిపోయారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిన బాధితురాలు రోజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆపరేషన్ జరిగిన వారం తర్వాత మహిళకు తీవ్ర రక్తస్రావం మొదలైంది. ఆగస్టు 22న కుటుంబ సభ్యులు ఆమెను అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాలని సూచించారు.

ప్రైవేటు వైద్యులు ఆమెను పరిశీలించి వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని బంధువులకు సూచించారు. ఎన్నో కష్టనష్టాల తర్వాత ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. బాధితురాలు రోజా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. కడుపులో దూది ఉండటంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బుధవారం మృతదేహాన్ని అచ్చంపేటకు తీసుకొచ్చిన బంధువులు అక్కడి ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Also Read: MLC Kavitha: జంతర్ మంతర్ వద్ద మళ్లీ ధర్నా చేస్తా, సోనియా, స్మృతిలను పిలుస్తా: ఎమ్మెల్సీ కవిత


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • died
  • doctors
  • Nagrakurnool
  • operation

Related News

    Latest News

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd