Bhopal : భోపాల్ లో దారుణం.. మహిళా ముఖంపై బ్లేడ్తో దాడి చేసిన దుండగులు
- By Prasad Published Date - 01:03 PM, Sun - 12 June 22
భోపాల్ లో ఈవ్ టీజింగ్ గురైన మహిళ ఆ యువకులపై ప్రతిఘటించింది. అయితే ప్రతిఘటించినందుకు ఓ మహిళపై కొంతమంది వ్యక్తులు బ్లేడుతో ఆమె ముఖంపై దాడి చేశారు. ఆమె ముఖంపై 118 కుట్లు పడ్డాయి. ఈ ఘటన భోపాల్లోని టీటీ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది భోపాల్లో పట్టపగలు కొందరు యువకులు మహిళపై దాడి చేశారు. దాడిలో గాయపడిన మహిళ ఒక కన్ను తెరవడం లేదు, ప్రస్తుతం ఆమె మాట్లాడటం లేదు. బాధితురాలి ముఖంపై 118 కుట్లు వేశారని పోలీసులు తెలిపారు. టీటీ నగర్ ప్రాంతంలో తన భర్తతో కలిసి బైక్పై వెళ్తున్నట్లు బాధితురాలు చెప్పిందని పోలీసులు తెలిపారు.
వాటర్ బాటిల్ కొనుగోలు కోసం భర్తతో కలిసి శ్రీ ప్యాలెస్ హోటల్కు వెళ్లిందని… ఆమె భర్త హోటల్లో ఉన్నప్పుడు, కొంతమంది యువకులు వచ్చి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ఈలలు వేయడం చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో ఆమె వారిని అడ్డుకుని ఒక వ్యక్తిని నాలుగు సార్లు చెప్పుతో కొట్టిందని తెలిపారు. కొంత సమయం తర్వాత వారు బాధితురాలు, ఆమె భర్త వాటర్ బాటిల్తో బయటకు వచ్చినప్పుడు మార్గ మధ్యలో యువకులు ఆమె ముఖంపై వెనుక నుండి దాడి చేశారని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గాయపడిన మహిళను ఆమె నివాసంలో పరామర్శించేందుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెళ్లారు
Tags
Related News
SHE Team: షీ టీమ్స్ నిఘా.. 488 మంది పోకిరీల పట్టివేత!
హైదరాబాద్ షీ టీమ్ మహిళలను వేధిస్తున్న 488 మంది వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.