Prices: కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తేనున్న ముకేంద్రం.. వాటిపై ధరలు పెంచనుందా?
- By Nakshatra Published Date - 09:24 PM, Sun - 18 December 22
Prices: కేంద్రం ఇకపై అన్ని రాష్ట్రాలలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ పై ఒకే విధమైన పన్నులు విధించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జీఎస్టీ కౌన్సిల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే ఎస్యూవీ వెహికల్స్ ధరలు పెరగడంతో పాటుగా ఆ వెహికల్స్ పై అధిక పన్నును కూడా కట్టాల్సి ఉంటుందట. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన 48వ జిఎస్టి కౌన్సిలింగ్ సమావేశం జరగగా ఇందులో 15 అంశాలపై చర్చలు జరగాల్సి ఉండగా కేవలం ఎనిమిది అంశాలపై మాత్రమే చర్చలు జరిపి ఆ సమావేశాన్ని ముగించారు.
ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి, కౌన్సిల్ సభ్యులు ఎంయూవి, ఎస్యూవీ గా పరిగణలోకి తీసుకోవాలి అంటే కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలు ఉండాలని కూడా ఆదేశించారు. వాటిలో ఎస్యూవీ కి ఈ ప్రమాణాలు ఉంటేనే ఆ వెహికల్ ని ఎస్యూవీ గా నిర్ధారించాల్సి ఉంటుందని సూచించారు. కారు ఇంజన్ కెపాసిటీ 1500 సీసీ కి మించి ఉండాలని,పొడవు 4000 మిమీ కంటే ఎక్కువగా ఉండాలని, అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎంఎం ఉండాలని సూచించారు. ఈ ప్రమాణాల్లో అన్నీ ఉంటేనే ఎస్యూవీ వెహికల్స్ అని స్పష్టం చేసింది కేంద్రం.
ఈ వాహనాలపై 28శాతం జిఎస్టి, 22శాతం సెస్ తో మొత్తంగా 50 శాతం పన్ను విధించాలని ఆదేశించింది. అలాగే ఇతర వాహనాలపై అసెస్మెంట్ 22 శాతం చెల్లించాలనే విషయంపై సెంట్రల్ అండ్ స్టేట్ టాక్స్ అథారిటీ సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందట. కాగా జీఎస్టీ కౌన్సిలింగ్ మీటింగ్ కు కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్షత వహించ నున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జీఎస్టీ కౌన్సిలింగ్ సమావేశం కు కేంద్రం ఆర్థిక మంచి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది.
Tags
Related News
Nirmala Sitharaman : డిజిటల్ మౌలిక సదుపాయాలు భారతదేశాన్ని విక్షిత్ భారత్ వైపు తీసుకెళ్తున్నాయి
డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2047 నాటికి దేశాన్ని విక్షిత్ భారత్ సాధించే దిశగా తీసుకెళ్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం అన్నారు.