Komatireddy: ఆడబిడ్డలకు తులం బంగారం పంపిణీపై నిర్ణయం తీసుకుంటాం: కోమటిరెడ్డి
- By Balu J Published Date - 11:49 AM, Thu - 18 January 24
Komatireddy: కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రజా పాలన కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఇక కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పంపిణీ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్హుల ఎంపిక కూడా పారదర్శకంగా చేపడతామని, అర్హులైన పేదలకే లబ్ధి చేకూరేలా అధికారులే గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తారన్నారు. ఆడపిల్లల పెండ్లి సమయంలోనే రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం అందజేస్తామని తెలిపారు. తులం బంగారం పంపిణీపై త్వరలోనే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
‘‘ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఏ పథకమైనా సరే గ్రామ సభల్లోనే అర్హులను ఎంపిక చేస్తారు. ఎమ్మెల్యేగా నేను ఎవరికి సిఫార్సు చేయాల్సిన అవసరం ఉండదు. త్వరలో రూ.10 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అందజేస్తాం” అని వెల్లడించారు. కాగా, జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నల్గొండ పట్టణంలో రూ.90 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు, రూ.1.30 కోట్ల నిధులతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఇకపై కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అధికారులే పంపిణీ చేస్తారని.. ఈ కార్యక్రమాలకు తాను రానని వెంకట్ రెడ్డి చెప్పారు.
‘‘గత ప్రభుత్వంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకే వచ్చేవి. అంతేగాక ఎమ్మెల్యేల చేతుల మీదుగానే పంపిణీ చేసేవారు. దాని వల్ల చెక్కుల పంపిణీ ఆలస్యమయ్యేది. కొంత పని ఒత్తిడి వల్ల నేను చెక్కులు పంపిణీ చేయడం ఆలస్యమైంది. ఇక నుంచి చెక్కుల పంపిణీ కార్యక్రమాలకు నేను రాను. ఇదే చివరి కార్యక్రమం. ఇక నుంచి అధికారులే గ్రామాలకు వచ్చి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు” అని తెలిపారు.
Related News
Harish Rao: రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao: కరీంనగర్లో ప్రెస్ మీట్ మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే పదవి పోతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోందని హరీశ్ రావు అన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటూ రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడని, ఎన్నికల హమీల గురించి, నాలుగు నెలల పాలన గురించి మాట్లాడడం లేదని హరీశ�