Vote From Home: ఇంటి నుంచే ఓటు.. దరఖాస్తు చేసుకోండిలా, అర్హులు వీరే..!
దేశవ్యాప్తంగా 2024 లోక్సభ ఎన్నికల ఓటింగ్ తేదీని ప్రకటించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఓటర్లకు ఇంటి నుంచే ఓటు (Vote From Home) వేసే వెసులుబాటు కల్పించారు.
- By Gopichand Published Date - 05:37 PM, Tue - 26 March 24
Vote From Home: దేశవ్యాప్తంగా 2024 లోక్సభ ఎన్నికల ఓటింగ్ తేదీని ప్రకటించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగనున్నాయి. ఇవి ఏప్రిల్ 19 నుండి జూన్ 1, 2024 వరకు జరుగుతాయి. భారతదేశంలో ఈసారి ఓటు వేయడానికి కోట్లాది మంది ఓటర్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఓటర్లకు ఇంటి నుంచే ఓటు (Vote From Home) వేసే వెసులుబాటు కల్పించారు. ఇంటి నుండి ఓటు వేసే విధానానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో..? ఎవరు అర్హులో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటి నుండి ఎవరు ఓటు వేయవచ్చు?
85 ఏళ్లు పైబడిన ఓటర్లు ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి కూడా ఈ సౌకర్యం కల్పించారు. ఎన్నికల ప్రక్రియలో సీనియర్ సిటిజన్లు ఉత్సాహంగా పాల్గొనాలని ఎప్పటి నుంచో చూస్తుంటారని, అయితే ఎన్నికల బూత్కు చేరుకోవడంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. దీంతో ఎన్నికల సంఘం వారికి ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది.
Also Read: Janasena : జనసేన లో ఏంజరుగుతుంది..అధినేత సూచనలు బేఖాతర్..!!
ఇంటి వద్దే ఓటు వేసే ప్రక్రియ
ఇంట్లో కూర్చొని ఓటు వేసే ప్రక్రియ చాలా సులభం. షెడ్యూల్ చేయబడిన ఓటింగ్ తేదీ కంటే ముందే కలెక్టర్ అటువంటి ఓటింగ్ కోసం ఒక తేదీని నిర్ణయిస్తారు. ఈ వ్యక్తులు నిర్ణీత ఓటింగ్ తేదీకి ముందే ఓటు వేయడానికి వీలు కల్పిస్తారు. వృద్ధులు, వికలాంగ ఓటర్లకు ఇంటి వద్దకే పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు.
ఇందులో తమకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేయవచ్చు. ఈ సమయంలో ఎన్నికల అధికారులు, ఒక వీడియోగ్రాఫర్, పోలీసులు కూడా ఉంటారు. తద్వారా ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండేలా చూసుకోవచ్చు. ఈ ప్రక్రియలో గోప్యత కోసం విభజన కూడా ఉంది. మొత్తం ప్రక్రియ దాదాపు 20 నిమిషాలు పడుతుంది. పోస్టల్ బ్యాలెట్ల నుండి ఓట్లు లెక్కించబడతాయి.
We’re now on WhatsApp : Click to Join
ఇంటి నుండి ఓటు వేయడానికి ఎక్కడ దరఖాస్తు చేయాలి..?
మీ ఇంట్లో ఉన్న ఎవరైనా సీనియర్ సిటిజన్ లేదా వికలాంగులు ఓటు వేయాలనుకుంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన 5 రోజుల్లోగా ఫారం 14డిని ఎన్నికల కమిషన్కు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ప్రకారం.. మార్చి 10, 2024 వరకు దేశవ్యాప్తంగా 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ ఓటర్లు 81.87 లక్షల మంది ఉన్నారు. అదే సమయంలో 100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 2.18 లక్షలు. వికలాంగ ఓటర్ల సంఖ్య 88.35 లక్షలు ఉన్నారు.
Tags
Related News
KCR : కాంగ్రెస్ లో అలజడి సృష్టించిన కేసీఆర్.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో..
తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని..వారిని ఇప్పుడంటే ఇప్పుడు బిఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు ఓ కీలక నేత రెడీ గా ఉన్నారని