TSPSC: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-1 నోటిఫికేషన్ కు అంతా సిద్ధం
తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలకు అంతా సిద్ధం.
- By Hashtag U Published Date - 10:45 AM, Sun - 24 April 22
తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలకు అంతా సిద్ధం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే తొలి నోటిఫికేషన్ కావడంతో నిరుద్యోగుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. నోటిఫికేషన్ విషయంపై శనివారం టీఎస్పీఎస్సీ ఓ సమావేశాన్ని కూడా నిర్వహించింది. మొత్తం 19 శాఖల్లో 503 ఖాళీలు ఉన్నాయి. దీనిపై బోర్డు.. పరిశీలన జరిపింది. తరువాత వాటిని
ఆమోదించింది. అయితే ఇంకా మూడు అంశాలపై ప్రభుత్వం నుంచి పర్మిషన్ కోసం ఎదురుచూస్తోంది.
ఇంతకుముందు గ్రూప్-1 కేటగిరీలో కొన్ని పోస్టులు ఉండేవి కావు. కాని ఇప్పుడు వాటిని కూడా దీని పరిధిలోకి తెచ్చారు. ఇక రాష్ట్రపతి కొత్త ఆదేశాల ప్రకారం.. రాష్ట్ర కేడర్ పోస్టులు కాస్తా.. ఇప్పుడు మల్టీ జోనల్ స్థాయికి చేరిపోయాయి. ప్రభుత్వం నిర్ణయం మేరకు ఇంటర్వ్యూలను తీసేశారు. దీనివల్ల గ్రూప్-1 పరీక్షా విధానంలోనే మార్పులు చేయక తప్పలేదు. అంటే రాత పరీక్ష 900 మార్కులకు ఉంటుంది. దీంతోపాటు
ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి వస్తుంది.
ఈ అంశాలపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అది వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ప్రకటించడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో అప్లికేషన్లను తీసుకోవడానికి ఎన్ని రోజుల సమయం ఇవ్వాలి.. దీంతోపాటు ప్రిలిమినరీ పరీక్షను ఎప్పుడు జరపాలి అన్నదానిపై ఇప్పటికే ఓ టైంటేబుల్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా గ్రూపు-1 పోస్టులను తక్కువగా భర్తీ చేస్తుంటారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో
వెలువడిన ప్రకటనలతో పోలిస్తే.. తెలంగాణలో తొలిసారిగా భర్తీ చేయనున్న గ్రూప్-1 పోస్టుల సంఖ్య ఎక్కువే. ఏకంగా 503 పోస్టుల భర్తీ అంటే మాటలు కాదు. నోటిఫికేషన్ వెలువడిన తరువాత దాదాపు 9 నెలల్లో ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇంటర్వ్యూలు లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది.
Related News
Group 1 Question Paper : గ్రూప్-1 ప్రశ్నాపత్రంలో ట్రాన్స్లేషన్ దోషాలు.. అభ్యర్థుల టైం వేస్ట్!
Group 1 Question Paper : ఆంధ్రప్రదేశ్లో మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది.