TRS Dharna: రైల్ నిలయాన్ని ముట్టడించిన టీ.ఆర్.ఎస్. ఇతర పార్టీల నాయకులు
వరంగల్ ఉమ్మడి జిల్లా కాజిపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీ.ఆర్.ఎస్. సహా ఇతర పార్టీల నాయకులు సికింద్రాబాద్ లోని రైల్ నిలయంను సోమవారం ముట్టడించారు.
- By Hashtag U Published Date - 07:03 PM, Mon - 31 January 22
వరంగల్ ఉమ్మడి జిల్లా కాజిపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీ.ఆర్.ఎస్. సహా ఇతర పార్టీల నాయకులు సికింద్రాబాద్ లోని రైల్ నిలయంను సోమవారం ముట్టడించారు.
కాజిపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే నిధులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదుట టీ.ఆర్.ఎస్ సహా ఇతర పార్టీల నాయకులు మహా ధర్నాను నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక అవలంభిస్తోందని ఆరోపిస్తూ రైల్ నిలయం ఎదుట నిరసన గళం గట్టిగా వినిపించారు.
ఈ సందర్భంగా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కాజిపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని, జాతీయ రహదారులు, రైల్వే లైన్స్ హామీలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కాజిపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. వరంగల్ లో రైల్వే డివిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. కాజిపేట్ – హుజురాబాద్ – కరీంనగర్ రైల్వే లైన్ పనులు సత్వరమే పూర్తి చేయాలని, రానున్న రోజుల్లో రైల్వే లైన్ పనులు, భూ సేకరణ వంటి అన్ని రకాల పనులను రైల్వే శాఖ నిధుల నుంచే వెచ్చించాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సిబ్బందితో రైల్వే లైన్స్ వేయడం వంటి అనేక కష్ట తరమైన పనులు చేయించుకుని.. అవి పూర్తయిన తర్వాత ప్రస్తుతం సుఖమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఇప్పుడు ఈ వర్గాలకు చెందిన ఉద్యోగుల అవసరం లేదని రైల్వే ఉన్నతాధికారులు భావిస్తున్నారని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాజిపేట్ రైల్వే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుంటే బీజేపీ నాయకులను వరంగల్ జిల్లాలో అడుగు పెట్టనిచ్చేది లేదని స్పష్టం చేశారు. అనంతరం రైల్వే ఇంచార్జి జీ.ఎం కు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీ.ఆర్.ఎస్. నాయకులు యాదవ రెడ్డి, సుందర్ రాజ్, వరంగల్ నగర కార్పొరేటర్లు , మాజీ కార్పొరేటర్ చింతల యాదగిరి, కాంగ్రెస్ నాయకులు జంగా రాఘవ రెడ్డి, సీపీఐ నాయకులు మేకల రవి, తిరుపతి, భిక్షపతి, సీపీఎం నాయకులు చుక్కయ్య, సీపీఐ ఎం ఎల్ నాయకులు గోవర్ధన్, అప్పారావు, టీ. ఎమ్మార్పీఎస్ నాయకులు భిక్షపతి, ఎమ్మార్పీఎస్ నాయకులు రవి, రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Related News
550 Jobs : రైల్వేలో 550 జాబ్స్.. టెన్త్ పాసై, ఆ సర్టిఫికెట్ ఉంటే చాలు
550 Jobs : ఇండియన్ రైల్వేస్లో ఉద్యోగం చేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు.