TRS Strategy: కల్వకుంట్ల ‘తారక’ మంత్రం!
కల్వకుంట్ల ఫ్యామిలీకి ఒక్కసారిగా స్వర్గీయ ఎన్టీఆర్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది.
- By Balu J Published Date - 04:00 PM, Sat - 28 May 22
కల్వకుంట్ల ఫ్యామిలీకి ఒక్కసారిగా స్వర్గీయ ఎన్టీఆర్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ట్యాంకు బండ్ మీద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడానికి ఒకప్పుడు ఉద్యమాకారులను రెచ్చగొట్టిన టీఆర్ఎస్ పార్టీ మనసు మార్చుకుంది. రెండు దశాబ్దాలుగా లేని ప్రేమను ఒలకబోస్తూ టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడం కోసమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి.
కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ అధినేతగా కొనసాగుతున్నా.. పూర్వాశ్రమంలో ఆయన టీడీపీ నేతేనన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటికే సినీ రంగంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్… టీడీపీ పేరిట రాజకీయ రంగ ప్రవేశం చేసే నాటికి ముందే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతగా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినా… టీడీపీలోనే ఆయనకు రాజకీయ నేతగా గుర్తింపు దక్కింది. టీడీపీ పేరిట పార్టీ పెట్టిన ఎన్టీఆర్ పిలుపునందుకుని పలు రంగాలకు చెందిన వారు ఆ పార్టీలో చేరిపోయారు. ఎన్టీఆర్ అంటే అప్పటికే ఎనలేని అభిమానాన్ని పెంచుకున్నకేసీఆర్ కూడా టీడీపీలో చేరిపోయారు. శనివారం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు. తెలుగు నేల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ను స్మరిస్తూ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా టీఆర్ఎస్కు చెందిన చాలా మంది నేతలు ఎన్టీఆర్కు నివాళి అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో మాసిన గెడ్డంతో ఎన్టీఆర్ కూర్చుని ఉండగా… ఆయన ముందు కాస్తంత వంగుని ఆయనను అభిమానంతో చూస్తూ కేసీఆర్ నిలబడ్డారు. కేసీఆర్ యువకుడిగా ఉన్న సమయంలో తీసిన ఫొటో ఇది. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్ రెడ్డి ట్విట్టర్ హ్యాండిల్ మీద ఈ ఫొటో కనిపించింది. నిజంగానే ఇది అత్యంత అరుదైన ఫొటోగానే చెప్పాలి.
అయితే ఎన్టీఆర్ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందే అనే చర్చ ఎప్పట్నుంచే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు నివాళులర్పించారు. టీఆర్ఎస్ మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ఆరెకపూడి గాంధీ ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. మీడియాతో నామా మాట్లాడుతూ.. ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను కేంద్రం ప్రకటించాలని పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. మల్లారెడ్డి కూడా ఎన్టీఆర్కు భారతరత్న అవార్డ్ను అందించాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ఆంధ్రా ఓటర్ల ఓట్లను తమవైపు తిప్పుకోవాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు రోజు, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన స్వర్గీయ తాత, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నివాళులర్పించడానికి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించారు. అభిమానుల తాకిడి నుంచి తప్పించుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ఉదయాన్నే వచ్చారు.
అయినప్పటికీ ఎన్టీఆర్ ను కలుసుకోవడానికి పెద్ద సంఖ్యలో జనాలు వేదిక వద్ద గుమిగూడారు. దీంతో సెక్యూరిటీ గార్డుల మధ్య నివాళులు కల్పించారు. రామారావు శత జయంతిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా వైభవంగా జరుపుకుంటున్నారు. అంతకుముందు ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు శత జయంతి ఘనంగా జరుగుతుందని అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం కేంద్ర మాజీ మంత్రి ఈ విషయాన్ని తెలిపారు. త్వరలో 100 రూపాయల నాణెంపై స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రం ఉంటుందని, దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరుపుతున్నామని బీజేపీ సీనియర్ నేత పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. దీంతో ఆయా పార్టీల నాయకులు ఎన్టీఆర్ జపం చేస్తున్నాయి. ఆయన ఇమేజ్ ను క్యాష్ చేసుకొని రాజకీయ లబ్ధి పొందలని చూస్తున్నాయి. టీడీపీకి మించి ఎన్టీఆర్ జపం చేస్తున్నాయి. వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా ఎన్టీఆర్ నామస్మరణ చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. వచ్చే ఎన్నికల్లో దివంగత ఎన్టీఆర్ సైతం కీలక రోల్ ప్లే చేస్తారనేది నిజం.
Remembering the legendary #NandamuriTarakaRamaRao garu on his 100th birth anniversary 🙏
The first leader who stood tall & fought against the Union Govt.
తెలుగు వాడి సత్తా చాటిన మహానాయకుడు ✊🏻
Demanding #BharatRatnaForNTR !#JoharNTR #100YearsOfNTR@tarak9999 @KTRTRS pic.twitter.com/tO1ZEoTl34
— YSR (@ysathishreddy) May 28, 2022
Related News
Pawan Kalyan : సరికొత్త వివాదానికి తెరలేపిన పవన్ వ్యాఖ్యలు
ఎన్టీఆర్ వంటి వారు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ వంటి వారు ఎన్ని విమర్శలు చేసినా వారిని ఎన్టీఆర్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని