HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Train Accident Train Runs Over Pushpak Express Passengers In Maharashtras Jalgaon

Train Accident: దేశంలో మ‌రో ఘోర రైలు ప్ర‌మాదం.. 20 మంది స్పాట్ డెడ్‌!

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స‌మాచారం. విష‌యం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

  • Author : Gopi Date : 22-01-2025 - 6:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Train Accident
Train Accident

Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. జల్గావ్‌లో పరండ రైల్వేస్టేషన్ వద్ద పుష్పక్ రైలులో మంటలు అంటుకున్నాయన్న తప్పుడు సమాచారంతో కొంత మంది ప్రయాణికులు చైన్ లాగారు. వెంటనే భయంతో చాలా మంది ప్ర‌యాణికులు ట్రైన్ నుంచి కిందకు దూకి వేరే పట్టాలపైకి వెళ్లారు. అదే సమయంలో బెంగుళూరుకు వెళ్తున్న రైలు పట్టాలపై ఉన్న వారిని ఢీకొట్టింది. దీంతో 20 మంది స్పాట్‌లోనే మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స‌మాచారం. విష‌యం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Also Read: Nitish Kumar: రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం.. బీజేపీకి మద్ద‌తు ఉప‌సంహ‌రించుకున్న నితీష్ కుమార్‌!

మహారాష్ట్రలోని జల్గావ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి పరండా స్టేషన్‌లోని పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు వ్యాపించాయ‌నే వార్త‌ల‌తో కొంద‌రు ప్ర‌యాణికులు చైన్ లాగి దిగేందుకు ప్ర‌య‌త్నించారు. చాలా మంది ప్రయాణీకులు పుష్ప‌క్‌ రైలు నుండి మ‌రో ట్రాక్‌పై దూకారు. ఇంత‌లోనే ఆ ట్రాక్‌పై వ‌స్తున్న క‌ర్ణాట‌క ఎక్స్‌ప్రెస్ ప్ర‌యాణికుల‌ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 20 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సమాచారం ప్రకారం.. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ నుండి సుమారు 35 నుండి 40 మంది ప్రయాణికులు ట్రాక్‌పై దూకారు. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లక్నో నుంచి ముంబై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని వార్త‌లు వ‌చ్చాయి.

క్షతగాత్రులంతా గ్రామీణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో తప్పుగా ఫైర్ అలారం మోగడంతో స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. చాలా మంది ప్రయాణికులు కర్నాటక ఎక్స్‌ప్రెస్ వ‌చ్చే ట్రాక్‌పై దూక‌డంతో ఢీకొట్టినట్లు చెబుతున్నారు. నివేదికల‌ ప్ర‌కారం.. 20 మంది మరణించారు. మ‌రో 30-40 మంది గాయపడినట్లు సమాచారం. పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

సెంట్రల్ రైల్వే సీపీఆర్వో డాక్టర్ స్వానిల్ తెలిపిన వివరాల ప్రకారం.. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లక్నో నుంచి ముంబైకి వస్తోంది. కొందరు ప్రయాణికులు ట్రాక్‌పైకి దిగారు. అటువైపు నుంచి వెళ్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ కొందరి ప్రయాణికులను ఢీకొట్టిందని తెలిపారు. రైలులో అలారం చైన్ లాగిన‌ట్లు గుర్తించారు. చైన్ పుల్లింగ్ ఎందుకు జరిగిందనే దానిపై రైల్వేశాఖకు ఇంకా సమాచారం లేదు.

డివిజనల్ రైల్వే మేనేజర్ భూసావల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే వైద్య బృందం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సమాచారం ప్రకారం.. రైలు కోచ్‌లో మంటలు వ్యాపించాయ‌నే వదంతుల నేప‌థ్యంలో ఆ కోచ్‌లోని ప్రయాణికులు వేరే ట్రాక్‌పై దూకడంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం అందుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • indian railways
  • Jalgaon
  • Maharashtra
  • Paranda Station Accident
  • train accident
  • Train Accident News

Related News

Mumbai's first closed-door local arrives

Mumbai: త్వరలో ముంబై ట్రాక్‌లపై నాన్-ఏసీ క్లోజ్డ్ డోర్ లోకల్ రైలు

Chennai ICF  దేశ ఆర్థిక రాజధాని ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించే లక్షలాది మందికి భారతీయ రైల్వే శుభవార్త అందించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నాన్-ఏసీ, ఆటోమేటిక్ డోర్లు మూసుకునే సదుపాయం ఉన్న లోకల్ రైలును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రద్దీగా ఉండే రైళ్ల నుంచి ప్రయాణికులు జారిపడి జరిగే ప్రమాదాలను నివారించడంతో పాటు తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం కల్పించడం ఈ కొత్త రైలు రూపకల్పన వె

    Latest News

    • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

    • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

    • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

    • Ultratech : పారిశ్రామిక చరిత్రలో సరికొత్త రికార్డు సాధించిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్

    • Eruditus Open House Series 2026 : విదేశీ విశ్వవిద్యాలయాలకు హైదరాబాద్ అడ్డా

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd