HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Train Accident Train Runs Over Pushpak Express Passengers In Maharashtras Jalgaon

Train Accident: దేశంలో మ‌రో ఘోర రైలు ప్ర‌మాదం.. 20 మంది స్పాట్ డెడ్‌!

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స‌మాచారం. విష‌యం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

  • By Gopichand Published Date - 06:17 PM, Wed - 22 January 25
  • daily-hunt
Train Accident
Train Accident

Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. జల్గావ్‌లో పరండ రైల్వేస్టేషన్ వద్ద పుష్పక్ రైలులో మంటలు అంటుకున్నాయన్న తప్పుడు సమాచారంతో కొంత మంది ప్రయాణికులు చైన్ లాగారు. వెంటనే భయంతో చాలా మంది ప్ర‌యాణికులు ట్రైన్ నుంచి కిందకు దూకి వేరే పట్టాలపైకి వెళ్లారు. అదే సమయంలో బెంగుళూరుకు వెళ్తున్న రైలు పట్టాలపై ఉన్న వారిని ఢీకొట్టింది. దీంతో 20 మంది స్పాట్‌లోనే మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స‌మాచారం. విష‌యం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Also Read: Nitish Kumar: రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం.. బీజేపీకి మద్ద‌తు ఉప‌సంహ‌రించుకున్న నితీష్ కుమార్‌!

మహారాష్ట్రలోని జల్గావ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి పరండా స్టేషన్‌లోని పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు వ్యాపించాయ‌నే వార్త‌ల‌తో కొంద‌రు ప్ర‌యాణికులు చైన్ లాగి దిగేందుకు ప్ర‌య‌త్నించారు. చాలా మంది ప్రయాణీకులు పుష్ప‌క్‌ రైలు నుండి మ‌రో ట్రాక్‌పై దూకారు. ఇంత‌లోనే ఆ ట్రాక్‌పై వ‌స్తున్న క‌ర్ణాట‌క ఎక్స్‌ప్రెస్ ప్ర‌యాణికుల‌ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 20 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సమాచారం ప్రకారం.. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ నుండి సుమారు 35 నుండి 40 మంది ప్రయాణికులు ట్రాక్‌పై దూకారు. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లక్నో నుంచి ముంబై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని వార్త‌లు వ‌చ్చాయి.

క్షతగాత్రులంతా గ్రామీణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో తప్పుగా ఫైర్ అలారం మోగడంతో స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. చాలా మంది ప్రయాణికులు కర్నాటక ఎక్స్‌ప్రెస్ వ‌చ్చే ట్రాక్‌పై దూక‌డంతో ఢీకొట్టినట్లు చెబుతున్నారు. నివేదికల‌ ప్ర‌కారం.. 20 మంది మరణించారు. మ‌రో 30-40 మంది గాయపడినట్లు సమాచారం. పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

సెంట్రల్ రైల్వే సీపీఆర్వో డాక్టర్ స్వానిల్ తెలిపిన వివరాల ప్రకారం.. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లక్నో నుంచి ముంబైకి వస్తోంది. కొందరు ప్రయాణికులు ట్రాక్‌పైకి దిగారు. అటువైపు నుంచి వెళ్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ కొందరి ప్రయాణికులను ఢీకొట్టిందని తెలిపారు. రైలులో అలారం చైన్ లాగిన‌ట్లు గుర్తించారు. చైన్ పుల్లింగ్ ఎందుకు జరిగిందనే దానిపై రైల్వేశాఖకు ఇంకా సమాచారం లేదు.

డివిజనల్ రైల్వే మేనేజర్ భూసావల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే వైద్య బృందం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సమాచారం ప్రకారం.. రైలు కోచ్‌లో మంటలు వ్యాపించాయ‌నే వదంతుల నేప‌థ్యంలో ఆ కోచ్‌లోని ప్రయాణికులు వేరే ట్రాక్‌పై దూకడంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం అందుతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • indian railways
  • Jalgaon
  • Maharashtra
  • Paranda Station Accident
  • train accident
  • Train Accident News

Related News

    Latest News

    • Indian Constitution: భారత రాజ్యాంగం.. డా. అంబేద్కర్ ఒక్కరే రాశారా?

    • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చ‌నిపోయారా? 3 వారాలుగా కుటుంబానికి నో ఎంట్రీ!

    • Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • World Largest City: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద నగరం ఏదో తెలుసా?!

    Trending News

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

      • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

      • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

      • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

      • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd