Road Accident: బైక్ ని ఢీకొట్టిన సిమెంట్ ట్రైలర్.. మహిళ మృతి
రాజస్థాన్ రామ్దేవ్రా నుంచి బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను సిమెంట్ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జత్రు అనే మహిళ మృతి చెందింది.
- By Praveen Aluthuru Published Date - 06:00 PM, Tue - 12 September 23
Road Accident: రాజస్థాన్ రామ్దేవ్రా నుంచి బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను సిమెంట్ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జత్రు అనే మహిళ మృతి చెందింది. కొద్దిసేపటికే సిమెంట్ ట్రైలర్ క్యాబిన్ లో మంటలు చెలరేగాయి. ప్రమాదం అనంతరం ట్రైలర్ డ్రైవర్ పరారయ్యాడు. బందర్సింద్రీ పోలీస్స్టేషన్ పరిధిలోని అజ్మీర్-కిషన్గఢ్ హైవేపై మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అజ్మీర్-జైపూర్ హైవే దాదాపు 3 గంటలపాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రైలర్ డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Telangana Liberation Day: సెప్టెంబర్ 17న తెలంగాణకు అమిత్ షా
Related News
Lok Sabha Elections 2024: ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. కట్ చేస్తే వెలుగులోకి భారీ నగదు
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ముందు ఖమ్మం మండలం కూసుమంచిలో జరిగిన ప్రమాదంలో భారీగా నగదు బయటపడింది. అతివేగంగా వచ్చిన వాహనం బోల్తా పడగా, అందులో భారీగా డబ్బు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.