TS: విషాదం…ముగ్గురు చిన్నారులు జలసమాధి..!!
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని సోలిపూర్ లో విషాదం నెలకొంది. సోలిపూర్ శివారులోని ఓ వెంచర్ నీటగుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
- By hashtagu Published Date - 03:52 PM, Mon - 26 September 22
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని సోలిపూర్ లో విషాదం నెలకొంది. సోలిపూర్ శివారులోని ఓ వెంచర్ నీటగుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు చిన్నారులు 10ఏళ్లలోపు ఉండటం…స్థానికంగా అందర్నీ కంటతడిపెట్టించింది. దసరా సెలవులు కావడంతో…చేపలు పట్టాలని నీళ్లలోకి దిగారు. నీటి గుంత లోతుగా ఉండటంతో …ముగ్గురు చిన్నారులు మునిగిపోయారు. ముగ్గురు పదేళ్లలోపు కావడంతో ఎలా రక్షించుకోవాలతో తెలియక ప్రాణాలు విడిచారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు…ఘటనాస్థలానికి చేరుకున్నారు. విగతజీవులుగా పడి ఉన్న తమ పిల్లలను చూసి బోరున విలపించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Tags
Related News
Chilkur: హనుమాన్ ఆలయానికి భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం వ్యక్తి
Chilkur: ప్రసిద్ధ చిల్కూరు బాలాజీ ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామం త్వరలో వార్తల్లోకి రానుంది. కొత్తగా నిర్మించిన హనుమాన్ ఆలయానికి ఒక ముస్లిం గ్రామస్థుడు 5 గుంటల భూమిని విరాళంగా ఇచ్చాడు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను పర్యవేక్షించడం కోసం ముఖ్య అతిథిగా చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఆహ్వానించారు. హనుమాన్ దేవాలయం కోసం తన స్థల�