Toyota Maruti SUV:క్రెటాను ఢీ కొట్టేందుకు మారుతీ, టొయోటా ప్లాన్..!
- By hashtagu Published Date - 10:35 AM, Fri - 18 March 22
జపాన్ కు చెందిన కార్ల తయారుదారీ సంస్థ టొయోటా మొత్తానికి మనదేశంలోనూ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తోంది. దానికి మారుతి కూడా తన వంతుగా సాయం చేస్తుంది. ఈ రెండు కంపెనీలు కలిసి ఇప్పుడు హ్యండాయ్ క్రెటాను ఛాలెంజ్ చేసే వాహనంపై ద్రుష్టి మళ్లించాయి. వీటిలో మారుతి వెర్షన్ ముందుగా…టొయోటా వెర్షన్ తర్వాత లాంచ్ కాబొతున్నాయి. ఈ కొత్త SUVలు హ్యుండాయ్ క్రెటా, ఫోక్స్ వాగన్ టైగున్, స్కోడా కుషాక్, ఎంజీ ఆస్టర్ లతో పోటీ పడి ఛాన్స్ ఉంది. పరిమాణం పరంగా చూసినట్లయితే మారుతి, టొయోటా SUVక్రెటాను మ్యాచ్ చేసే విధంగా ఉండబోతున్నట్లు లీక్స్ ను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి ఫ్లాగ్ షిప్ కారు ఎస్ -క్రాస్ ను ఈ కొత్త SUV రీప్లేస్ చేయనుంది.
ఈ రెండు SUVల ఎక్స్ టీరియర్ డిజైన్ పూర్తిగా భిన్నంగా ఉండనున్నాయి. టొయోటాలో మరింత అగ్రెసివ్ డిజైన్ ఉండనున్నట్లు సమాచారం. స్టైలిష్ లోనూ…ఈ SUVలు లుక్ సూపర్బ్ గా ఉంటుంది. ఈ రెండింటినీ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వీటిలో 16 నుంచి 17 ఇంచుల మధ్యలో ఉండే అల్లోయ్ వీల్స్ కూడా అందించారు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, డీఆర్ఎల్స్ కూడా ఇందులో ఉన్నాయి. డీఆర్ఎల్ సిగ్నేచర్లలో నూ ఈ రెండింటి మధ్యలో ఎంతో తేడాలు ఉన్నాయి. వీటి ఇంటీరియర్ కూడా దాదాపు ఒకే విధంగా ఉంది. పెద్ద టచ్ స్క్రీన్ , డిజిల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి. పనోరమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి.
ఇక ఈ రెండు SUV లో సరికొత్త ఇన్ ఫోటెయిన్ మెంట్ సిస్టంను అందించారు. బలెనో తరహాలోనే ఇన్ ఫోటెయిన్ మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది. అంతేకాదు వీటిలో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360 డిగ్రీల కెమెరా కూడా ఉంటుంది. ఈ రెండింటిలోనూ 1.5లీటర్ పెట్రోల్ ఇంజిన్…లేటెస్ మోడల్ గేర్ బాక్స్ కూడా ఉండనున్నట్లు సమాచారం. వీటితోపాటు హైబ్రిడ్ వెర్షన్ కూడా లాంచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ హైబ్రిడ్ వెర్షన్ ఎక్కువ మైలేజ్ ను అందిస్తుందని బయటకు వస్తన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి వీటిలో ఎలక్ట్రిక్ వెర్షన్లు విడుదల కావడం లేదు. 2023లో మార్కెట్లోకి ఇవి రిలీజ్ కానున్నాయి. అయితే వీటికి ముందు కొత్త అర్బర్, క్రూజర్ లేదా బ్రెజా కార్లు రానున్నట్లు లీక్స్ ను బట్టి తెలుస్తోంది.
Related News
Toyota Kirloskar: పెరగనున్న టయోటా కార్ల ధరలు.. ఎంతంటే..?
ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ (Toyota Kirloskar) మోటార్ వాహనాలు ఖరీదైనవిగా మారనున్నాయి.