Wrestlers Rejoin Work : తిరిగి జాబ్స్ లో చేరిన రెజ్లర్లు సాక్షి, వినేష్, పునియా
- By Pasha Published Date - 03:21 PM, Mon - 5 June 23
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా చాలా వారాలపాటు నిరసన తెలిపిన స్టార్ రెజ్లర్లు మళ్ళీ తమతమ జాబ్స్ లో చేరారు. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా రైల్వేలో తమ విధులను తిరిగి ప్రారంభించారు. ఈవిషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ముగ్గురు మే 31న తమ పనిని మళ్ళీ ప్రారంభించారు. “తిరిగి జాబ్స్ లో చేరినంత మాత్రాన మేం న్యాయపోరాటం ఆపినట్టు కాదు.. న్యాయం జరిగేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. మేం కేసులు వెనక్కి తీసుకోలేదు. పోరాటం నుంచి వెనకడుగు వేయలేదు. దీనిపై దయచేసి మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దు” అని సాక్షి మాలిక్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
ये खबर बिलकुल ग़लत है। इंसाफ़ की लड़ाई में ना हम में से कोई पीछे हटा है, ना हटेगा। सत्याग्रह के साथ साथ रेलवे में अपनी ज़िम्मेदारी को साथ निभा रही हूँ। इंसाफ़ मिलने तक हमारी लड़ाई जारी है। कृपया कोई ग़लत खबर ना चलाई जाए। pic.twitter.com/FWYhnqlinC
— Sakshee Malikkh (@SakshiMalik) June 5, 2023
ఈ ముగ్గురు రెజ్లర్లు శనివారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఒక మైనర్తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్ల పై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై నిష్పాక్షిక విచారణ చేయాలని కోరారు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని అమిత్ షా రెజ్లర్లకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. “చట్టం దాని పని అది చేసుకుపోతుంది. న్యాయ ప్రక్రియతోనే ఈ అంశానికి పరిష్కారం లభిస్తుంది” అని రెజ్లర్లతో అమిత్ షా చెప్పినట్లు మీడియాలో న్యూస్ రిపోర్ట్స్ వచ్చాయి.
Tags
Related News
Vinesh Phogat: ఫుట్పాత్పై వినేష్ ఫోగట్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు
డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో తనకు దక్కిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని వినేష్ మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.