HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Top Us Doctor Calls For Warning Labels On Social Media

Warning Labels : ‘సోషల్’ యాప్స్‌పైనా వార్నింగ్ లేబుల్స్.. అమెరికా సర్జన్ జనరల్ వివేక్ వ్యాఖ్యలు

అమెరికా ప్రభుత్వ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Author : Pasha Date : 18-06-2024 - 12:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Warning Labels On Social Media Apps

Warning Labels : అమెరికా ప్రభుత్వ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొగాకు ఉత్పత్తులపై వార్నింగ్ లేబుల్ ఉన్నట్టే.. సోషల్ మీడియా యాప్‌లపై కూడా వార్నింగ్ లేబుల్స్‌ను డిస్‌ప్లే చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా సోషల్ మీడియా వేదికల వల్ల యువత, టీనేజీ బాలికలు చాలా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని వివేక్ మూర్తి చెప్పారు. అందుకే వాటిపై వార్నింగ్ లేబుల్స్‌ను వాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు వివరాలతో ఆయన ‘న్యూయార్క్ టైమ్స్‌’లో వ్యాసం రాశారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘సోషల్ మీడియాను వినియోగించే యువత, టీనేజర్లు మానసికంగా ప్రభావితం అవుతున్నారు. వాళ్లు సోషల్ మీడియాను ఒక పరిమితికి మించి వాడినప్పుడు.. పేరెంట్స్‌ను అలర్ట్ చేసేలా వార్నింగ్ లేబుల్స్(Warning Labels) ఉపయోగపడాలి. ఈమేరకు సోషల్ మీడియా యాప్‌లలో మార్పులు చేయాల్సిన బాధ్యత ఆయా కంపెనీలపై ఉంది. దీనిపై అమెరికా కాంగ్రెస్ చట్టం చేయాల్సిన అవసరం ఉంది’’ అని అమెరికా ప్రభుత్వ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి వ్యాసంలో ప్రస్తావించారు.

Also Read :Tamanna Bathing : ప్రతి సండే నో స్నానం.. ఎందుకో చెప్పిన తమన్నా

2019 సంవత్సరంలో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ విడుదల చేసిన అధ్యయన నివేదిక ప్రకారం.. సోషల్ మీడియాలో ప్రతిరోజు సగటున మూడు గంటల పాటు గడిపే యువత డిప్రెషన్‌ రిస్క్‌ను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు సోషల్ మీడియా వల్ల పిల్లలు, యువతపై చెడు ప్రభావం పడకుండా నిలువరించే  చర్యలను చేపట్టే దిశగా కసరత్తును మొదలుపెట్టాయి.  ప్రత్యేకించి సోషల్ మీడియా అతి వినియోగం వల్ల తీవ్ర ఆందోళన, నిరాశ, మానసిక సమస్యలు వస్తున్నాయని అధ్యయన నివేదికలు ఘోషిస్తున్నాయి.

రెండు రాష్ట్రాల్లో కీలక ముందడుగు

  • తల్లిదండ్రుల సమ్మతి లేకుండా 18 ఏళ్లలోపు పిల్లలకు అభ్యంతరకర కంటెంట్‌ను చూపించకుండా సోషల్ మీడియా యాప్స్‌‌ను  నిలువరించేలా న్యూయార్క్ రాష్ట్ర సెనేట్  ఈ నెలలోనే  ఓ బిల్లును ఆమోదించింది.
  • 14 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వినియోగించకుండా నిషేధించే బిల్లుపై ఈ ఏడాది మార్చిలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ సంతకం చేశారు. ఆ బిల్లు ప్రకారం 14, 15 ఏళ్ల పిల్లలు సోషల్ మీడియా యాప్స్‌ను వాడేందుకు పేరెంట్స్ అనుమతిని తప్పనిసరిగా పొందాలి.

Also Read : Electricity Purchase Scam : తెలంగాణ డిస్కంలకు వేల కోట్ల నష్టం.. కారణం అదేనా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • us
  • US Surgeon General
  • Vivek Murthy
  • warning labels
  • Warning Labels On Social Media

Related News

War Effect On India

యుద్ధం ఎఫెక్ట్ : ఇండియా లో ఏ ఏ వస్తువులకు ధరలు పెరగబోతున్నాయో తెలుసా ?

ఈ యుద్ధం కేవలం పెట్రోల్ ధరలకే పరిమితం కాకుండా వంటగదిపై కూడా ప్రభావం చూపుతోంది. భారత్ దిగుమతి చేసుకునే 16 మిలియన్ టన్నుల వంట నూనెల్లో పొద్దుతిరుగుడు నూనె వాటా 20 శాతం ఉంది. ఎర్ర సముద్రం గుండా రవాణా వ్యయాలు పెరగడం వల్ల నూనె ధరలు భగ్గుమంటున్నాయి

  • Us Attack Iran

    US Israel Iran War : ఇరాన్ పై యుద్ధం..భారత్ కు తీవ్ర నష్టం

  • Trump Iran

    US, Israel attack Iran : ఓపక్క దాడి చేస్తూనే..మరోపక్క చర్చలకు సిద్ధమంటున్న ట్రంప్

  • America Attack On Iran

    America Attack on Iran : ఇరాన్ పై అమెరికా దాడులకు అదే కారణమా?

Latest News

  • టీ20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్‌.. వ‌ర్షం ప‌డితే విజేత ఎవ‌రో తెలుసా?!

  • నేపాల్ ప్ర‌ధానిగా మాజీ మేయర్ బాలెన్ షా?

  • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

  • దిండుపై త‌ప్పుగా ప‌డుకుంటున్నారా?!

  • ఏ కారు కొంటే మంచిది?!

Trending News

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

    • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

    • 23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

    • పాకిస్థాన్ క్రికెట్‌ జట్టులో కలకలం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd