Hyderabad: మానవత్వానికే మచ్చ.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని కన్నబిడ్డనే చంపిన తల్లి
అక్రమ సంబంధాల మోజులో పడి కన్నవాళ్లనే హత్య చేస్తున్నారు కొందరు.
- By Balu J Published Date - 04:53 PM, Wed - 12 July 23
రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. అక్రమ సంబంధాల మోజులో పడి కన్నవాళ్లనే హత్య చేస్తున్నారు కొందరు. ప్రియుడి మోజులో పడి కన్నబిడ్డనే హతమర్చింది ఓ తల్లి. ఈ ఘటన (Hyderabad) కుషాయిగూడలో చోటుచేసుకుంది. కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ మార్కెట్ వెనుక వీధిలో నివాసముంటున్న నాయిక్వాడి రమేష్ కుమార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం కల్యాణి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు తన్విత (ఐదేండ్ల పాప) అనే కుమార్తె ఉంది. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు.
కళ్యాణి కూతురిని తీసుకుని కుషాయిగూడలోని తల్లిదండ్రుల ఇంటి సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకుంది. పాప స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. భర్త నుంచి విడిపోయిన కళ్యాణికి స్థానికంగా ఉన్న మరో యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. పాప అడ్డుగా ఉందని భావించిన తల్లి.. నిద్రిస్తున్న నాలుగున్నరేళ్ల బాలికను దిండుతో కప్పి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత తనకేం తెలియదన్నట్లు ప్రవర్తించింది.
అయితే కూతురు మృతి పట్ల భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ భర్త రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఊపిరాడక చిన్నారి మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసులు తమదైన స్టైల్ లో ఎంక్వైరీ చేయగా, అసలు విషయం బయట పడింది. హైదరాబాద్ (Hyderabad) సిటీలో ఈ తరహా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: Pani Puri: గూగుల్ డూడుల్లో పానీ పూరి
Related News
Hyderabad: హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు.. భారీగా గంజాయి, డబ్బులు స్వాధీనం
Hyderabad: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు గంజాయి అక్రమ రవాణా ను నియంత్రించేందుకు మల్టీ జోన్ 1 పరిధిలో 16 జిల్లాల్లో పోలీసులు, ప్రధాన రోడ్డు మార్గాల్లో వాహన తనిఖీలతో పాటు రైళ్ళల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అక్రమ గంజాయి కట్టడి చేయాలనే లక్ష్యంగా మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ ఆదేశాల మేరకు మల్టీ జోన్ 1 పరిధిలోని 16జిల్లాల్లో పోలీస్ అధికారులు, ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టా