Elections: రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల బృందం
తెలంగాణలో త్వరలో ఎన్నికల సమరం మొదలుకాబోతుంది.
- By Balu J Published Date - 03:21 PM, Tue - 3 October 23
Elections: తెలంగాణలో త్వరలో ఎన్నికల సమరం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రజాక్షేత్రంలో కి వెళ్తున్నాయి. సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. రేపో, మాపో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం హైదరాబాద్కు చేరుకుంది.
చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేతోపాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా అధికారులు స్వాగతం పలికారు. కాసేపట్లో ఈ బృందం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. మూడు రోజులపాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
Also Read: Sridevi Death: శ్రీదేవి మృతిపై బోని కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అసలు నిజాలివే!
Related News
Cheetah Dies : నారాయణపేట జిల్లాలో ఎండదెబ్బకు చిరుత మృతి
ఈ ఎండలకు కేవలం మనుషులే కాదు అడవిలో ఉన్న జంతువులు సైతం మృతువాత పడుతున్నాయి. తాజాగా జాదవరావుపల్లిలో వడదెబ్బతో చిరుత మృతి చెందింది