HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Telangana Congress To Protested Against Ed Summons To Sonia Gandhi

T-Congress: ఈడీపై టీకాంగ్రెస్ సమరం

న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని విచారణకు పిలిపించినందుకు నిరసనగా టీకాంగ్రెస్‌ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.

  • By Balu J Published Date - 01:32 PM, Thu - 21 July 22
  • daily-hunt
Tcongress
Tcongress

న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని విచారణకు పిలిపించినందుకు నిరసనగా టీ-కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. గురువారం హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశ పూర్వకంగా టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. “దేశం కోసం తమ ప్రాణాలను, ఆస్తులను త్యాగం చేసిన గొప్ప చరిత్ర గాంధీలకు ఉంది. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ తమ ప్రాణాలను త్యాగం చేశారు. సోనియాగాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారు.

బీజేపీ మత విద్వేష రాజకీయాల ద్వారా దేశాన్ని విభజిస్తుంటే, ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మన సుసంపన్నమైన సంస్కృతి, భిన్నత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యంలో ఏకత్వం అనే సంప్రదాయాన్ని పెంపొందించేందుకు జోడో యాత్రను చేపడుతున్నారని అన్నారు. జూలై 22న రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్‌ సభ్యులు ధర్నాలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీ-కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు శశిధర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య‌, మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్, సునీత రావు, మల్లు రవి, బల్మూరు వెంకట్ తదితరులు పాల్గొనగా, టీ-కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ మాత్రం ఢిల్లీ ధర్నాలో పాల్గొన్నాడు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

Related News

Latest News

  • Nani : హీరో నాని చాల పెద్ద తప్పు చేసాడు..ఫ్యాన్స్ అంత ఇదే మాట

  • Ustaad Bhagat Singh : ఉస్తాద్ పని అయిపోయింది ..!!

  • IND Beat PAK: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా!

  • Pakistan: భార‌త్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు అవమానం.. వీడియో వైర‌ల్‌!

  • Health Tips: పాల‌తో ఈ ప‌దార్థాల‌ను క‌లిపి తీసుకుంటే డేంజ‌ర్‌!

Trending News

    • 8th Pay Commission: దీపావళికి ముందే భారీ శుభ‌వార్త‌.. ఏంటంటే?

    • Vahanamitra: వాహనమిత్రకు ఎవరు అర్హులు? ఎవ‌రు అన‌ర్హులు??

    • GST Reform: గుడ్ న్యూస్‌.. ఈ వ‌స్తువుల‌పై భారీగా త‌గ్గిన ధ‌ర‌లు!

    • Policy Premium: పాలసీ ప్రీమియం చెల్లింపులో ఆలస్యం చేయకండి.. ఎందుకంటే?

    • Jersey Sponsorship: టీమిండియా కొత్త‌ జెర్సీ స్పాన్సర్‌పై బిగ్ అప్డేట్‌ ఇచ్చిన బీసీసీఐ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd