ఈ నెల 9న తెలంగాణ మంత్రిమండలి సమావేశం!
- By Balu J Published Date - 09:59 AM, Mon - 6 March 23
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 9న కీలక మంత్రిమండలి సమావేశం జరుగనున్నది. ప్రగతిభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు. ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కొంత కాలం నుంచి కొత్త పీఆర్సీ కోసం డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే కొత్త పీఆర్సీ అమలు చేయాలని వినతులు వస్తుండటంతో.. దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
Related News
Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కు మరో కీలక పదవి దక్కింది
మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కు మరో కీలక పదవి అప్పగించింది అధిష్టానం. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు ఇచ్చారు. నేషనల్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మంత్రి శ్రీధర్ బాబు ను ఎంపిక చేసారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఫోకస్ అంత లోక్ సభ ఎన్నికల ఫైనే దృష్టిసారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ�